చైతూ కార్గిల్ వార్ షూట్ కు బ్రేక్
ఆమిర్ఖాన్ కొత్త చిత్రం 'లాల్సింగ్ చద్దా' చిత్రీకరణ ఆఖరి షెడ్యూల్ను వచ్చే నెలలో ప్రారంభించాలి. కార్గిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కే సన్నివేశాల్లో అక్కినేని నాగచైతన్య పాల్గొననున్నారు.కానీ షూట్ వాయిదా పడింది.
మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ఖాన్ నటిస్తున్న ‘లాల్సింగ్ చద్దా’ చిత్రంలో నాగచైతన్య ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ను ఈ నెలాఖరులో కశ్మీర్లోని కార్గిల్లో జరిపేందుకు సన్నాహాలు చేసారు. దాదాపు 45రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కార్గిల్ నేపథ్య యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించటానికి ప్లాన్ చేసారు.
ఇందులో నాగచైతన్య పాల్గొనబోతున్నారు. సినిమాలో కీలమైన ఈ షెడ్యూల్లో నాగచైతన్యపై ముఖ్యఘట్టాల్ని చిత్రీకరించనున్నారు. అయితే ఈ షూట్ ని హోల్డ్ లో పెట్టారని సమాచారం. కరోనా సమస్యలుతో ఈ షూట్ ని హోల్డ్ లో పెట్టారా లేక, వేరే కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
నాగచైతన్య నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రమిదే కావడం విశేషం. హాలీవుడ్లో పెద్ద హిట్టైన ‘ఫారెస్ట్ గంప్’ (1994) చిత్రానికి రీమేక్ ఇది.అద్వైత్చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.
మరోవైపు నాగ చైతన్య తన తదుపరి తెలుగు చిత్రం థాంక్స్ షూటింగ్ కోసం ఇటీవల ఇటలీకి వెళ్లారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్. ఇందులో చైతన్య మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 2021 ద్వితీయార్థంలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కోవిడ్ -19 రెండవ వేవ్ కారణంగా శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన అతని తదుపరి విడుదల లవ్ స్టోరీ వాయిదా పడింది.