నాగచైతన్య వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు చండూ మొండేటితో సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన పలు అప్‌డేట్లు వైరల్‌ అవుతున్నాయి. 

వరుస ఫెయిల్యూర్స్ తో నాగచైతన్యని కాస్త డల్‌ అయ్యారు. నెక్ట్స్ సినిమాల విషయంలో ఆయన చాలా కేర్‌ తీసుకుంటున్నారు. అందుకే పరశురామ్‌ సినిమాని కూడా పక్కన పెట్టారు. ప్రస్తుతం ఆయన చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `కార్తికేయ 2` తర్వాత చందూ మొండేటి నుంచి వస్తోన్న చిత్రమిది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. అందులో భాగంగా హీరోయిన్‌కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. 

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారట. అందుకు కీర్తిసురేష్‌, అనుపమా పరమేశ్వరన్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. నాగచైతన్య సరసన కీర్తిసురేష్‌ని హీరోయిన్‌గా అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇక అనుపమా పరమేశ్వరన్‌ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుందని తెలుస్తుంది. హీరోతో ట్రావెల్‌ అయ్యే రోల్‌ అని కాకపోతే చాలా కీలకంగా ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఎవరూ ఫైనల్‌ కాలేదని, జస్ట్ టాక్స్ లో ఉందని సమాచారం. 

ఇదిలా ఉంటే ఈ సినిమా కథా నేపథ్యానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా స్టోరీ కి సంబంధించిన ఓ లీకేజీ బయటకు వచ్చింది. ఈ సినిమా మత్య్సకారుల బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందట. శ్రీకాకుళంలోని కళింగపట్నం మత్య్సకారుల కథానేపథ్యంలో నాగచైతన్య సినిమా సాగుతుందని, ఈ బ్యాక్‌ డ్రాప్‌ సినిమా కథకి కీలకం కాబోతుందని టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. నాగచైతన్య మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఫస్ట్ టైమ్‌ చైతూ ఒక రా కంటెంట్‌తో రాబోతున్నారని అర్థమవుతుంది.

నాగచైతన్యకి ఇటీవల సక్సెస్‌లు లేవు. `బంగార్రాజు` తర్వాత వరుసగా పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన `లాల్‌ సింగ్‌ చద్దా`, `థ్యాంక్యూ`, `కస్టడీ` చిత్రాలు డిజాస్టర్‌ అయ్యాయి. అందుకే చాలా కేర్‌ తీసుకుంటున్నారట చైతూ. ఈ సినిమాతో నమ్మకంతో ఉన్నారు అక్కినేని హీరో. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.