షాక్ :చైతుని చూడ్డం కోసం నదిలో దూకేసిన అభిమాని
స్టార్స్ ఉండే ఫ్యాన్స్ లెక్కలు వేరే ఉంటాయి. తమ హీరో కోసం రిలీజ్ రోజు కటౌట్స్ కడుతూంటారు. థియోటర్స్ లో పూలు,కాగితాలు విసురుతారు. తెరపైకు హీరో రాగానే హారతులు ఇస్తూంటారు. ఇంకో అడుగు ముందుకేసి చాలా దూరాల నుంచి నడిచి వచ్చేస్తూంటారు. రకరకాల విన్యాసాలతో తమ హీరోల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా అక్కినేని నాగచైతన్య అభిమాని కూడా అలాంటి ఓ విన్యాసం చేసి అందరి దృష్టిలో పడ్డాడు. వార్తల్లోకు ఎక్కారు. అయితే అతని చేసిన సాహసం మాత్రం అభినందించతగినది కాదు.
స్టార్స్ ఉండే ఫ్యాన్స్ లెక్కలు వేరే ఉంటాయి. తమ హీరో కోసం రిలీజ్ రోజు కటౌట్స్ కడుతూంటారు. థియోటర్స్ లో పూలు,కాగితాలు విసురుతారు. తెరపైకు హీరో రాగానే హారతులు ఇస్తూంటారు. ఇంకో అడుగు ముందుకేసి చాలా దూరాల నుంచి నడిచి వచ్చేస్తూంటారు. రకరకాల విన్యాసాలతో తమ హీరోల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా అక్కినేని నాగచైతన్య అభిమాని కూడా అలాంటి ఓ విన్యాసం చేసి అందరి దృష్టిలో పడ్డాడు. వార్తల్లోకు ఎక్కారు. అయితే అతని చేసిన సాహసం మాత్రం అభినందించతగినది కాదు.
వివరాల్లోకి వెళితే... ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘థ్యాంక్యూ’. ఇది చైతు 20వ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరిలో జరుగుతోంది. ఈ షూటింగ్ సెట్స్కు అక్కినేని అభిమానులంతా క్యూ కడుతున్నారు. చైతూను చూసేందుకు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్కి గుంపులు గుంపులుగా చేరారు. ఇది గమనించిన నాగచైతన్య అక్కడికి వచ్చిన అభిమానులందరిని కలిసి వారితో ఫొటోలు దిగాడు.
ఆ క్రమంలో అక్కడ నదిలో నాగచైతన్యతో ఓ సన్నివేశం షూట్ చేస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఓ వీరాభిమాని చైతును చూసేందుకు ఏకంగా నదిలోకే దూకేశాడు. ఊహించని విధంగా అభిమాని నదిలో దూకడంతో షూటింగ్కు బ్రేక్ ఏర్పడింది. దీంతో డైరెక్టర్ షూటింగ్కు ప్యాకప్ చెప్పాడు. ఆ తర్వాత చైతు సదరు అభిమానిని కలిసారు. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని చెప్పి, కాసేపు అతడితో మాట్లాడాడు. అనంతరం అభిమానితో ఫొటో దిగి తిరిగి పంపించటం జరిగింది. ఇక తన అభిమాన హీరోని కలిసే అవకాశం వచ్చినందుకు సదరు అభిమాని ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్. ఆయన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి కథ, మాటలు అందిస్తున్నారు. థాంక్యూ సినిమాలో నాగచైతన్యతో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని ప్రచారం సాగుతోంది. థాంక్యూ ఒక కమర్శియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. దీన్ని దిల్ రాజు తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఇది 2021 చివర్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవితో కలిసి లవ్స్టోరీ సినిమాలో నటిస్తున్నారు.