గమనించారా? ‘రాధేశ్యామ్’ తాజా పోస్టర్ లో అది మిస్సైంది
రైలులో ప్రయాణిస్తూ చిరు నవ్వులు చిందిస్తున్న పూజా ఫొటో అభిమానులను అలరిస్తోంది. ఇందులో పూజా ‘ప్రేరణ’ అనే పాత్రలో నటిస్తోంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది టీమ్ తో షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం.
ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా సంభందించిన పోస్టర్స్ రిలీజ్ అవుతున్నాయి కానీ జనాలకు కావాల్సిన అతి ముఖ్యమైన అప్ డేట్ మాత్రం రావటం లేదు. అది మరేదో కాదు...ఈ సినిమా సంగీత దర్శకుడు ఎవరననేది. ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లే కీ టెక్నీషియన్లందరి పేర్లూ కనిపించాయి. కానీ సంగీత దర్శకుడి పేరు మిస్సైంది. ఓహో ఇంకా మ్యూజిక్ డైరక్టర్ ని ఫైనలైజ్ చేయలేదు కాబోలు..అందుకే రాలేదు అనుకున్నారు. తాజాగా పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. దాని మీదా సంగీత దర్శకుడి పేరు లేకపోవటం అందరికీ షాక్ ఇచ్చింది.
గత ఆరేడు నెలలుగా షూటింగ్ లేదు కాబట్టి...మ్యూజిక్ డైరక్టర్ విషయంలో ఓ క్లారిటీకి వస్తారని అందరూ భావించారు. కానీ ఎందుకు ఏమీ తేల్చలేదు అన్నది ఫ్యాన్స్ కు ఏమాత్రం అర్థం కావడం లేదు. మంగళవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా పూజా లుక్ను చిత్ర టీమ్ అభిమానులతో పంచుకుంది. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఇందులో పూజా డ్రెస్సింగ్ స్టైల్ కూడా అలాగే ఉంది.
రైలులో ప్రయాణిస్తూ చిరు నవ్వులు చిందిస్తున్న పూజా ఫొటో అభిమానులను అలరిస్తోంది. ఇందులో పూజా ‘ప్రేరణ’ అనే పాత్రలో నటిస్తోంది. మరోవైపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది టీమ్ తో షూటింగ్ జరుపుతున్నట్లు సమాచారం.
యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్డౌన్ విరామం తర్వాత ఇటీవలే చిత్రబృందం ఇటలీకి పయనమైంది. ప్రస్తుతం ప్రభాస్తో పాటు ప్రధాన తారాగణంపై ఇటలీలోని పురాతన భవంతుల్లో కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. యూరప్ బ్యాక్డ్రాప్లో పీరియాడికల్ లవ్స్టోరీగా ఈ సినిమా రూపుదిద్దుకోనున్నది.