పెళ్లి పేరుతో మోసం.. తెలుగు నటిపై అత్యాచారానికి పాల్పడిన బిల్డర్..
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ తెలుగు నటిపై ముంబైకి చెందిన బిల్డర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ తెలుగు నటిపై ముంబైకి చెందిన బిల్డర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. వివరాలు.. 24 ఏళ్ల బాధిత నటి కొన్ని తెలుగు చిత్రాల్లో నటించారు. నిందితుడు ఆదిత్య అజయ్ కపూర్ ముంబై సబర్బన్ బాంద్రాలోని ఒక కామన్ ఫ్రెండ్ నివాసంలో నటిని కలుసుకున్నారు. ఆ తర్వాత వారు ఒకరికొకరు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ తర్వాత ఒకరికొకరు టచ్లో ఉన్నారు. వీరిద్దరి మధ్య పరిచయం పెరిగి.. ఒకరికొకరు సన్నిహితంగా మారారు. ఆ సమయంలో ఆదిత్య అజయ్ కపూర్.. నటిని పెళ్లిచేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడు.
కఫీ పరేడ్ ప్రాంతంలోని ఆదిత్య నివాసంలో అతడు తనపై అత్యాచారం చేశాడని బాధిత నటి ఆరోపించారు. అలాగే గోవాలో కూడా తనపై అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని అడిగితే.. అతడితో శారీరక సంబంధం కొనసాగించాలని పట్టుబట్టినట్టుగా తెలిపారు. అయితే అందుకు తాను వ్యతిరేకించడంతో.. అసభ్యకరంగా దూషిస్తూ దాడికి పాల్పడినట్టుగా ఆరోపించారు. తన తల్లిదండ్రుల ఫోన్లకు అసభ్యకరమైన సందేశాలు పంపి.. చంపేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు.
ఈ వేధింపులతో విసిగిపోయిన బాధిత నటి పోలీసులను ఆశ్రయించారు. బాధిత నటి ఫిర్యాదు మేరకు.. అత్యాచారం ఆరోపణలపై మొదట ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత నేరం జరిగిన అధికార పరిధి.. కఫ్ పరేడ్ పోలీస్ స్టేషన్ కావడంతో అక్కడికి బదిలీ చేశారు. దీంతో ఆదిత్యపై అత్యాచారంతోపాటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదిత్యను అరెస్ట్ చేశామని.. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.