Asianet News TeluguAsianet News Telugu

అమలాపురంలో మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో ఉద్రిక్తత

  • అమలాపురంలో ప్రభాస్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మధ్య వార్
  • ప్రభాస్ బాహుబలి అదనపుషోలు ఎలా వేస్తారంటూ మెగా ఫ్యాన్స్ వార్
  • తమ హీరో సినిమాకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించిన మెగా ఫ్యాన్స్
mega fans prabhas fans war in amalapuram

'బాహుబలి-2' మూవీ రిలీజ్ సమయంలో చోటు చేసుకున్న ఓ వివాదం తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ప్రభాస్ అభిమానులు, మెగా ఫ్యామిలీ అభిమానుల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో బాహుబలి-2 సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద పోలీసులు మోహరించారు.

 

బాహుబలి-2 సినిమాకు సంబంధించి అక్రమంగా అదనపు షోలు ప్రదర్శించడమే అని తెలుస్తోంది. దీన్ని మెగా అభిమానులు అడ్డుకునే ప్రయత్నం చేయడం, దాన్ని ప్రభాస్ అభిమానులు ప్రతిఘటించే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

 

ఆంధ్రప్రదేశ్ లో బాహుబలి-2 మూవీ రోజూ 6 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం 7 గంటలకు మొదటి షో మొదలవ్వాల్సి ఉండగా... గురువారం రాత్రే పోలీసుల అనుమతితో అదనంగా షోలు వేసి వాటికి భారీగా టిక్కెట్ డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

 

గురువారం రాత్రే బాహుబలి -2 షోలు వేయడాన్ని మెగా ఫ్యామిలీ అభిమాన సంఘాలు, ఇతర హీరోల అభిమాన సంఘాలు వ్యతిరేకిస్తూ వందలాదిగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని దీనిపై కంప్లైంట్ చేసారు, పోలీసులు ఆ షోలను ఆపకపోతే తామే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ, ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన మెగా అభిమానులను పోలీసులు అడ్డుకోవడంతో వారు డీఎస్పీ, ఆర్డీవో కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ గొడవ సంగతి అమలాపురంలో క్షణాల్లో పాకిపోయింది. భారీగా ఆందోళనకారులు అక్కడికి చేరుకోవడం మొదలు పెట్టారు.

 

మెగా అభిమానులు బాహుబలి-2 షోల విషయంలో గొడవ చేస్తున్నరనే విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోకి దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎలాంటి గొడవలు జరుగకుండా థియేటర్ల వద్ద పోలీసులు మోహరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios