నిర్మాత దిల్రాజు చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. కంటెంట్ నచ్చి `మసూద` అనే చిత్రాన్ని తన బ్యానర్పై విడుదల చేయబోతున్నారు. దీంతో ఆ సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సినిమాలో కంటెంట్ ఉంటే అది ఆడియెన్స్ ని రీచ్ అయ్యేందుకు అనేక దారులు ఓపెన్ అవుతుంటాయని అంటున్నారు. అలా బడా డిస్ట్రిబ్యూటర్ చేతిలో పడితే దాని దశ తిరిగినట్టే. తాజాగా `మసూద` అనే మూవీ అలాంటి అదృష్టాన్నే దక్కించుకుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేయబోతుండటం విశేషం. సినిమా కంటెంట్ నచ్చిన దిల్రాజు ఈ చిత్రాన్ని తన ఎస్వీసీ బ్యానర్పై డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
తాజాగా ఈ విషయాన్ని దిల్రాజు వెల్లడించారు. ఈ చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్(స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్) తీసిన రెండు సినిమాలు `మళ్లీరావా`, `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`లకు తాను అభిమానిని అని తెలిపారు దిల్రాజు. ``ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`తో స్వరూప్ని డైరెక్టర్గా, నవీన్ పోలిశెట్టిని హీరోగా పరిచయం చేశాడు. నవీన్కి ఆ సినిమా ఎంత ప్లస్ అయ్యిందో తెలిసిందే. రాహుల్ అభిరుచిగల నిర్మాత. ఆ రెండు సినిమాల జర్నీ నాకు నచ్చి.. అప్పుడే రాహుల్కి మాటిచ్చాను.. తర్వాత ఏదైనా సినిమా ఉంటే.. నువ్వు నిర్మించిన తర్వాత మా ద్వారా రిలీజ్ చేద్దాం అని చెప్పాను.
ఆయన నిర్మించిన ‘మసూద’ చిత్రాన్ని మా ఎస్విసి ద్వారా రిలీజ్ చేయబోతున్నాం. ఈ సినిమా టీజర్ చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా, ఎగ్జయిటింగ్గా అనిపించింది. టీజర్ చూడగానే రాహుల్కి ఫోన్ చేసి చెప్పాను. ఈ సినిమాతో కూడా కొత్తవారిని పరిచయం చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా చూడబోతున్నాను. ఫైనల్ కాపీ చూసేందుకు ఐయామ్ వెయిటింగ్. రాహుల్తో అసోసియేట్ అవడం చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోందని చెప్పారు దిల్రాజు.
చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ..`దిల్ రాజుగారిది చాలా మంచి చెయ్యి. నాది కూడా మంచి చెయ్యి. రెండు మంచి చేతులు కలిస్తే గట్టిగా సౌండ్ వస్తుందని భావిస్తున్నాను. `మసూద` మూడు సంవత్సరాల కష్టమిది. మధ్యలో కోవిడ్ రావడంతో ఆలస్యమైంది. మొదటి నుంచి నేను చెబుతున్నట్లుగా.. కొత్త డైరెక్టర్స్ని 5గురుని పరిచయం చేస్తున్న తరుణంలో.. ఇప్పుడు 3వ దర్శకుడు సాయికిరణ్ని పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకి ఎందరో టాలెంటెడ్ పర్సన్స్ వర్క్ చేశారు. మధ్యలో వేరే అవకాశాలు వచ్చినా వెళ్లకుండా.. ఈ సినిమా కోసం 3 ఇయర్స్ కష్టపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాకీ అవకాశం ఇచ్చిన రాజుగారికి థ్యాంక్స్. ఆయన నమ్మకం నిలబెట్టుకుంటాననే హోప్ అయితే నాకుంది. బుధవారం సాయంత్రం సోనీ మ్యూజిక్ ద్వారా ఫస్ట్ లిరికల్ సాంగ్ విడుదల చేయబోతున్నాం` అని చెప్పారు.
స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ‘మసూద’ చిత్రానికి సాయికిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంతో ఆయన డైరెక్టర్గా పరిచయం చేస్తున్నారు. తిరువీర్, కావ్యకళ్యాణ్రామ్, బాందవిశ్రీధర్ హీరోహీరోయిన్లుగా నటించారు. హారర్-డ్రామా ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది.
