మహేష్-త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్ళాల్సింది. ఇక జులై నుండి రెగ్యులర్ షూటింగ్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరలా కథ విషయంలో మహేష్ మార్పులు సూచించారనే సమాచారం అందుతుంది. ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయ్యాక స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఏంటి అనే సందేశాలు మొదలయ్యాయి.
సరిలేరు నీకెవ్వరు హిట్ తర్వాత మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లితో చేయాల్సింది. చివరి నిమిషంలో ఆ మూవీ వాయిదా పడింది. కొన్ని నెలల తర్వాత దర్శకుడు పరుశురాం తో సర్కారు వారి పాట చిత్రం ప్రకటించారు. మే 12న విడుదలైన సర్కారు వారి పాట మంచి విజయాన్ని అందుకుంది. వరల్డ్ వైడ్ రూ. 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక సర్కారు వారి పాట విడుదలకు ముందే దర్శకుడు త్రివిక్రమ్ తో మహేష్(Mahesh babu) తన 28వ చిత్రం ప్రకటించారు. ఇటీవల పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. హీరోయిన్ పూజా హెగ్డే తో పాటు దర్శకుడు త్రివిక్రమ్, మహేష్ వైఫ్ నమ్రతా శిరోద్కర్ పూజా వేడుకకు హాజరయ్యారు.
వాస్తవానికి ఇప్పటికే మహేష్-త్రివిక్రమ్(Trivikram) మూవీ సెట్స్ పైకి వెళ్ళాల్సింది. ఇక జులై నుండి రెగ్యులర్ షూటింగ్ అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. మరలా కథ విషయంలో మహేష్ మార్పులు సూచించారనే సమాచారం అందుతుంది. ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయ్యాక స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు ఏంటి అనే సందేశాలు మొదలయ్యాయి. ఇక హీరోయిన్ పూజా హెగ్డే విషయంలో కూడా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. పూజా హెగ్డేను చిత్రం నుండి తొలగించారని, ఆమె స్థానంలో వేరొకరిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న పుకార్లు కొత్త కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అసలు ఈ సినిమా ఉన్నట్లా లేనట్లా అనే అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. కాగా అల వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ హీరో ఎన్టీఆర్ (NTR)తో మూవీ ప్రకటించారు. అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. ఇప్పుడు మహేష్ మూవీ పరిస్థితి కూడా అంతేనా అనే సందేహం కలుగుతుంది.
చక చకా త్రివిక్రమ్ మూవీ పూర్తి చేసి మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా ఎక్కడో తేడా కొడుతుంది. ఇక రాజమౌళి మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నాయి. రాజమౌళి స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ కి రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ సమకూరుస్తున్నారు.