పొన్నియన్ సెల్వన్-2 రిలీజ్ కూడా త్వరలోనే..? మణిరత్నం ఏమన్నారంటే..?
ప్రస్తుతం దేశమంతా ఎదురు చూస్తున్న సినిమాల్లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కూడా ఉంది. ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పార్ట్ 1 సినిమాతో పాటు.. పార్ట్ 2 సినిమాపై కూడా భారీ అప్ డేట్ ను ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట డైరెక్టర్. మరి ఇందులో నిజమెంత.
ప్రస్తుతం దేశమంతా ఎదురు చూస్తున్న సినిమాల్లో పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 కూడా ఉంది. ఎప్పుడు చూద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పార్ట్ 1 సినిమాతో పాటు.. పార్ట్ 2 సినిమాపై కూడా భారీ అప్ డేట్ ను ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట డైరెక్టర్. మరి ఇందులో నిజమెంత.
భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ తో ఎదురు చూస్తున్న సినిమా పొన్నియన్ సెల్వన్-1. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. . ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేశాయి. మణిరత్నం టేకింగ్, విజువల్స్ను ఎప్పుడెప్పుడు తెరపై చూద్ధామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాన నుంచి మేకర్స్ వరుసగా అప్డేట్లను రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ అప్ డేట్స్ తో పాటు సినిమాపై అంచనాలు పెంచేలా ప్రమోషన్స్ ను చేస్తున్నారు. ప్రస్తుతం భారీ స్థాయిలో ప్రమోషన్లు చేస్తున్నారు మూవీటీమ్. రీసెంట్ గా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేశారు టీమ్. తమిళ సినీ పరిశ్రమ మొత్తం ఈ ఈవెంట్ కు వచ్చి.. ఈ సినిమాకు సపోర్ట్ ఇచ్చారు. ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు.
ప్రమోషన్లో భాగంగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్-2 రిలీజ్ డేట్ గురించి వెల్లడించారు. మొదటి భాగం విడుదలైన ఆరు నుండి తొమ్మిది నెలలోపే సెకండ్ పార్ట్ను విడుదల చేస్తామని చెప్పి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. అంటే దాదాపు వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా పొన్నియన్ సెల్వన్ పార్ట్-2 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కనుకు సూపర్ సక్సెస్ సాధిస్తే... పార్ట్ 2 పై అంచనాలు ఇంకా పెరుగుతాయి. ఈ లెక్కతో తమిళ పరిశ్రమ పూర్వ వైభవం సాధించాలని చూస్తుంది.
ఇక ఇప్పటికే ఈ రెండు పార్ట్లకు సంబంధించిన డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 125 కోట్లకు సొంతం చేసుకున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కిన ఈసినిమా ఫస్ట్ పార్ట్ లో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు సందడి చేయబోతున్నారు.ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థతో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.