Asianet News TeluguAsianet News Telugu

ఆ టైమ్‌లో రెండు సార్లు మిస్‌ క్యారీ అయ్యింది ః మహిమా చౌదరి

తాజాగా మహిమా తన మ్యారేజ్‌ గురించి, తన మిస్‌ క్యారీ గురించి పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. తనకు కార్‌ యాక్సిడెంట్‌ అయ్యిందని చెప్పింది. ఆ తర్వాత తన లైఫ్‌ పూర్తిగా మారిపోయిందని చెప్పింది. 

mahima choudhry revealed her miscaarriages and marriage life  arj
Author
Hyderabad, First Published Apr 7, 2021, 12:26 PM IST

`పర్దేశ్‌` స్టార్‌ మహిమా చౌదరి రెండు సార్లు మిస్‌ క్యారీ అయ్యిందట. అంతేకాదు కార్‌ యాక్సిడెంట్‌ విషయాలను వెల్లడించి షాక్‌ ఇచ్చింది. తన మ్యారేజ్‌ లైఫ్‌లోని ట్రబుల్స్ ని బయపెట్టిందీ మాజీ నటి. షారూఖ్‌ ఖాన్‌ నటించిన `పర్దేశి` చిత్రంతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన మహిమా చౌదరి తొలి చిత్రంతో ఆకట్టుకుని ఫిల్మ్ ఫేర్ అవార్డుని అందుకుంది. `దాగ్‌`, `దడ్కన్‌`, `దీవానే`, `కురుక్షేత్ర`, `ఖిలాడి 420`, `లజ్జా`, `దిల్‌ హై తుమ్హారా`, `దొబారా`, `సెహర్‌` వంటి చిత్రాలతో నటించి స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. 

తాజాగా మహిమా తన మ్యారేజ్‌ గురించి, తన మిస్‌ క్యారీ గురించి పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించింది. తనకు కార్‌ యాక్సిడెంట్‌ అయ్యిందని చెప్పింది. ఆ తర్వాత తన లైఫ్‌ పూర్తిగా మారిపోయిందని చెప్పింది. రెండు సార్లు మిస్‌ క్యారీ అయ్యిందట. తనకు మాతృత్వం పొందాలని ఉందని, కానీ రెండు సార్లు మిస్‌ క్యారీ అయ్యిందని చెప్పింది. దీంతో మానసికంగా ఎంతో స్ట్రగుల్‌ పడిందట. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహిమా ఈ విషయాలను వెల్లడించింది. `మీకు వచ్చిన ఇబ్బందులను తల్లిదండ్రులకు చెప్పరు. ఎందుకంటే ఇవన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తుంటాయి. అలా దాస్తూ పోతుంటే వరుసగా సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో నేను బిడ్డని కనాలని అనుకున్నా. కానీ గర్భస్రావం అయ్యింది. ఆ తర్వాత మరోసారి బిడ్డకోసం ప్రయత్నిస్తే మళ్లీ మిస్‌ క్యారీ అయ్యింది. ఆ సమయంలో నేను సంతోషంగా లేకపోవడానిక ఇదే కారణం.  ఆ తర్వాత తనకు పాప పుట్టిందని, నేను బయటకు వెళ్లి ఈవెంట్లు చేయాలనుకున్నప్పుడు పాపని తల్లి వద్ద ఉంచాను` అని చెప్పింది. 

తన తల్లి తనకు ఎంతో ధైర్యాన్ని, సపోర్ట్ నిచ్చిందని, తన కష్టాలను ప్రత్యక్షంగా చూసిందని, ఎంతో ఓదార్పునిచ్చిందని చెప్పింది. ఎందుకు ఇంతగా కష్టపడుతున్నావు. నీ లైఫ్‌లోని ఎత్తపల్లాలు చూశాను. కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండు అని చెప్పింద`ని పేర్కొంది. బాబీ ముఖర్జీతో ఏర్పడిన మనస్పార్థాల వల్ల వీరిద్దరు 2013లో విడాకులు తీసుకున్నారు. మహిమా తెలుగులో `మనసులో మాట` అనే చిత్రంలో నటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios