Asianet News TeluguAsianet News Telugu

ఫ్లాష్ న్యూస్.. మహేష్ కోసం క్రిష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో సక్సెస్ అందుకొని ఇప్పుడు తన తదుపరి సినిమా 'మహర్షి' ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తరువాత మహేష్.. సుకుమార్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. 

Mahesh Wants Krish for Geetha arts
Author
Hyderabad, First Published Nov 8, 2018, 2:15 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో సక్సెస్ అందుకొని ఇప్పుడు తన తదుపరి సినిమా 'మహర్షి' ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా తరువాత మహేష్.. సుకుమార్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మహేష్ ఆలోచన మారినట్లు సమాచారం. కొద్దిరోజులుగా గీతాఆర్ట్స్ బ్యానర్ లో మహేష్ బాబు సినిమా చేయబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ సినిమాకి దర్శకుడిగా 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. కానీ దర్శకుడు మాత్రం సందీప్ రెడ్డి కాదు.. క్రిష్ అని తెలుస్తోంది.

ప్రస్తుతం క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే మహేష్ సినిమా కోసం పని చేస్తాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వెలువడనుంది. రియలిస్టిక్ సినిమాలు తెరకెక్కించే క్రిష్.. మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నాడో తెలియాల్సివుంది!

Follow Us:
Download App:
  • android
  • ios