మహేష్, త్రివిక్రమ్, త్రిష.. `అతడు` మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
చాలా గ్యాప్తో మరోసారి మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మరోసారి `అతడు` మ్యాజిక్ని రిపీట్ చేయాలని భావిస్తున్నారట.
మహేష్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం `అతడు`. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమా థియేటర్లలో యావరేజ్గానే ఆడింది. కానీ టీవీలో మాత్రం అత్యధిక రేటింగ్ అందుకున్న చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా మంచి రేటింగ్ వస్తుంటుంది. అంతేకాదు అత్యధికసార్లు టీవీ ప్రసారమైన సినిమానూ రికార్డ్ సృష్టించింది. త్రివిక్రమ్ సినిమాలు హంగూ ఆర్భాటాలకు అతీతంగా ఎప్పుడూ చూసిన ఓ ఫ్రెష్ ఫీలింగ్ ని ఇస్తుంటాయి. అందుకే ఆయా చిత్రాలకు టీవీలోనూ మంచి ఆదరణ లభిస్తుంది. అందుకు ఉదాహరణే `అతడు`.
ఆ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్లో `ఖలేజా` వచ్చింది. కానీ ఇది బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. చాలా గ్యాప్తో మరోసారి మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా రాబోతుంది. త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో మరోసారి `అతడు` మ్యాజిక్ని రిపీట్ చేయాలని భావిస్తున్నారట. ఇందులో హీరోయిన్గా త్రిషని తీసుకునే ఆలోచనలో మాటల మాంత్రికుడు ఉన్నారని సమాచారం. అయితే హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
పూజా హెగ్డే, కియారా, జాన్వీ, మాళవిక మోహనన్ వంటి పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వాళ్లందరిని పక్కన పెట్టి త్రిష వైపు మొగ్గు చూపుతున్నారని త్రివిక్రమ్. ఆల్మోస్ట్ కన్ఫమ్ అనే టాక్ వినిపిస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకి చోటు ఉందని, మరో కథానాయికగా నివేదా థామస్ని తీసుకోబోతున్నారని టాక్. ప్రస్తుతం త్రిష `పొన్నియిన్ సెల్వన్`, `గర్జణై`,`సతురంగ వెట్టై 2`, `రాంగి`, `రామ్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. దీంతోపాటు కన్నడలో పునిత్ రాజ్కుమార్తో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. `యూటర్న్` ఫేమ్ పవన్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.