ఆఫ్రికా ఫారెస్ట్ నేపథ్యంలో మహేష్-రాజమౌళి సినిమా సాగుతుందని విజయేంద్రప్రసాద్ కూడా చెప్పారు. ఇదే కాకుండా జక్కన్న మైండ్లో మరో సంచలన కథ ఉందట. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రూపొందిన `ఆర్ఆర్ఆర్`(RRR Movie) సినిమా సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. సినిమా స్టోరీపై విమర్శలున్నా, ఓవరాల్గా పలు మెరుపులు, విజువల్ వండర్గా ఉండటంతో సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియెన్స్. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. మరో నాలుగురోజులపాటు ఈ సినిమా రన్ ఉండనుంది. అయితే నెమ్మదిగా ఈ చిత్రం నుంచి బయటపడుతున్నారు జక్కన్న. తాను నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టబోతున్నారు.
రాజమౌళి.. నెక్ట్స్ మహేష్బాబు(Mahesh)తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ వర్క్ జరుగుతుంది. తండ్రి విజయేంద్రప్రసాద్ వర్క్ చేస్తున్నారు.బేసిక్ లైన్ ఉందని, దాన్ని కూర్చొని వర్కౌట్ చేసి కథగా మలచాలని ఇటీవల రాజమౌళి తెలిపారు. కానీ ఇప్పుడు రాజమౌళి మదిలో రెండు స్టోరీలున్నాయట. ఇప్పటికే వినిపిస్తున్న ఓ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాహసవీరుడి కథతో ఈ సినిమా ఉంటుందని ఓ వార్త బయటకు వచ్చిన విసయం తెలిసిందే. ఆఫ్రికా ఫారెస్ట్ నేపథ్యంలో సినిమా సాగుతుందని విజయేంద్రప్రసాద్ కూడా చెప్పారు.
ఇదే కాకుండా రాజమౌళి మైండ్లో మరో స్టోరీ రన్ అవుతుంది. హాలీవుడ్లో సంచలన విజయం సాధించిన విలియమ్ వైలర్ `బెన్హర్`(Ben Hur) సినిమా నుంచి ఇన్స్పైర్ అయిన స్టోరీ కూడా ఉందని తెలుస్తుంది. 1959లో వచ్చిన హాలీవుడ్ చిత్రం `బెన్హర్` రికార్డులు క్రియేట్ చేసింది. అత్యధికంగా ఆస్కార్ అవార్డులను(11 విభాగాల్లో) అందుకున్న సినిమాగా నిలిచింది. అణచివేతపై స్వేచ్ఛ కోసం, తన ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ వీరుడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అలాంటి కథ నేపథ్యంలో మహేష్తో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే యాంగిల్లోనూ జక్కన్న ఆలోచిస్తున్నారట. మరి ఈ రెండింటిలో దేన్ని వర్కౌట్చేస్తారనేది ఆసక్తిగా మారింది. కానీ ఈ సరికొత్త స్టోరీ వార్త గూస్బంమ్స్ తెప్పిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఈ చిత్రం దాదాపు పదేళ్ల క్రితమే సెట్ అయ్యిందట. `బాహుబలి` కంటే ముందే మహేష్తో ఓ సినిమా చేయాలని అనుకున్నారట. మహేష్కి, రాజమౌళికి ఆ సమయంలోనే కమిట్మెంట్ ఏర్పడిందని, కానీ అనుకోకుండా అది సెట్ కాలేదని, అప్పటి మాట కోసం రాజమౌళి ఇప్పుడు మహేష్తో సినిమా చేస్తున్నట్టు ఇటీవల రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలా పదేళ్ల క్రితం రావాల్సిన సినిమా ఇప్పుడు వస్తుందని చెప్పొచ్చు. ఏదేమైనా మహేష్-రాజమౌళి కాంబినేషన్లో సినిమా అంటే అది మరో స్థాయిలో ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దాదాపు ఆరేడు వందల కోట్లతో సినిమాని నిర్మించాలనుకుంటున్నారట. కే ఎస్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
