సర్కారు వారి పాట విడుదలై నెలలు దాటుతున్నా మహేష్ కొత్త మూవీ సెట్స్ పైకి తీసుకెళ్లడం లేదు. మహేష్ తన 28వ చిత్రం దర్శకుడు త్రివిక్రమ్ తో ప్రకటించారు. అనేక కారణాలతో ఆలస్యం కాగా ఫైనల్ గా మూవీ పట్టాలెక్కనుందన్న సమాచారం అందుతుంది.

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)చిత్రంతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మహేష్. మిస్ట్ టాక్ లో కూడా సర్కారు వారి పాట రికార్డు వసూళ్లు సాధించింది. దర్శకుడు పరుశురాం తెరకెక్కించగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. కాగా మహేష్ చాలా కాలం క్రితమే దర్శకుడు త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ మూవీ ప్రకటించారు. గత ఏడాదే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. త్రివిక్రమ్ భీమ్లా నాయక్ మూవీ పనుల్లో బిజీగా కావడం వలన కొంత ఆలస్యమైంది. అలాగే స్క్రిప్ట్ విషయంలో మహేష్ సంతృప్తిగా లేరనే ప్రచారం కూడా జరిగింది. 

ఎట్టకేలకు మహేష్-త్రివిక్రమ్(Trivikram) మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం అందుతుంది. ఆగస్టు నుండి మహేష్ 28 చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. ఇక 2023 సమ్మర్ కానుకగా ఈ మూవీ విడుదల చేయనున్నారట. హారిక హాసిని క్రియేషన్స్ తో కలిసి మహేష్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. గతంలో వీరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు విడుదలయ్యాయి. 

ఇక త్రివిక్రమ్ మూవీ అనంతరం మహేష్(Mahesh Babu) దర్శకుడు రాజమౌళితో చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇటీవల పారిస్ లో గల ఓ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోని రాజమౌళి సందర్శించారు. దాదాపు మూడేళ్లు ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందట.