మహేష్-త్రివిక్రమ్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండగా ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఈసారి మహేష్ భారీ టార్గెట్ తో బరిలో దిగుతున్నట్లు తెలుస్తుంది.
సర్కారు వారి పాటతో (Sarkaru Vaari paata) మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు మహేష్. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం దాదాపు రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ మూవీ భారీగా ప్లాన్ చేస్తున్నారట. మహేష్ తన 28వ (SSMB 28) చిత్రాన్ని త్రివిక్రమ్ తో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీ అనుకోని కారణాలతో ఆలస్యమైంది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. హైదరాబాద్ శివారులో ఓ భారీ కాలనీ సెట్ నిర్మిస్తున్నట్లు సమాచారం. జులై నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
ఇక ఈ మూవీ బడ్జెట్ ఏకంగా రూ. 200 కోట్లకు పెంచేశారట. ఓ రీజనల్ మూవీకి ఈ రేంజ్ బడ్జెట్ అంటే మాటలు కాదు. ఇందులో మహేష్ (Mahesh babu) రెమ్యూనరేషన్ రూ. 60 కోట్లు కాగా, దర్శకుడు త్రివిక్రమ్ రూ. 50 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. మిగిలిన రూ. 90 కోట్లు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణానికి కేటాయించారట. సినిమా బడ్జెట్ రీత్యా రూ. 300 బిజినెస్ టార్గెట్ తో దిగుతున్నారట. చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ రూ. 150 కోట్లుకు విక్రయించనున్నారట. ఇక శాటిలైజ్, డిజిటల్ రైట్స్ కోసం మరో రూ. 150 కోట్ల ఆఫర్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
మొత్తంగా మహేష్-త్రివిక్రమ్ టార్గెట్ 300 కోట్లు అన్నట్లు ఈ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నారట. త్రివిక్రమ్(Trivikram) సొంత నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్ ఈ చిత్రం నిర్మిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మూవీ ద్వారా రూ. 100 కోట్లు ఆర్జించే సూచనలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తన మాస్టర్ మైండ్ ఉపయోగించి హీరోల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. మహేష్ మూవీ కూడా పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.
ఇక వరుసగా మూడో సినిమాకు త్రివిక్రమ్ పూజా హెగ్డే (Pooja Hegde)ను తీసుకోవడం విశేషం. ఆమెను తన లక్కీ చార్మ్ గా భావిస్తున్న త్రివిక్రమ్ వదలడం లేదు. అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో చిత్రాల్లో పూజా నటించగా... మహేష్ తో మరోసారి పూజా జతకడుతుంది. గతంలో వీరి కాంబినేషన్ లో మహర్షి తెరకెక్కిన విషయం తెలిసిందే.