Asianet News TeluguAsianet News Telugu

SSMB28 నైజాం రైట్స్ ఆఫర్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్

తన మార్క్‌   ఎమోషనల్‌ డ్రామాతో ఈసారి కూడా ప్రేక్షకులను మెస్మరైజ్  చేయడానికి త్రివిక్రమ్‌ సిద్ధమవుతున్నాడు. 

Mahesh Babu-Trivikram film SSMB28  Nizam rights
Author
First Published Jan 30, 2023, 3:40 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కలయికలో  చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్  ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.   మహేష్‌ కెరీర్‌లో 28వ సినిమాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. అందులోనూ 11 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి మూవీ చేస్తుండటంతో ఇది పక్కా బంపర్‌ హిట్‌ అని అభిమానులు ఓ అంచనాకు వచ్చేశారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ ఆల్రెడీ ప్రారంభమైపోయింది.

అందుతున్న సమాచారం మేరకు  #SSMB28 నైజాం రైట్స్ దిల్ రాజు 50 కోట్లకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరో ప్రక్క ఏషియన్ సునీల్ సిండికేట్...48 కోట్లు ఆఫర్ చేసారని, నెగోషియేషన్స్ జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఎవరికి ఈ చిత్రం రైట్స్ వెళ్లబోతున్నాయనేది తెలియాల్సి ఉంది. అయితే ముందుగా భావించినట్లు ఈ సినిమాను  సమ్మర్‌లో రిలీజ్‌ చేసే అవకాశాలు కనిపించడం లేదు. 

మహేష్ చెప్పినట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, షూటింగ్‌ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. త్రివిక్రమ్ ఎలాగైనా పెద్ద హిట్ కొట్టాలని చూస్తున్నారు.  తన మార్క్‌   ఎమోషనల్‌ డ్రామాతో ఈసారి కూడా ప్రేక్షకులను మెస్మరైజ్  చేయడానికి త్రివిక్రమ్‌ సిద్ధమవుతున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తర్వాత మహేష్‌ ఎలాగూ రాజమౌళితో హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయనున్నాడు. ఈ సినిమాలో మహేస్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. మహేష్ పూర్తిగా ఓ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు.
 
ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.
 

Follow Us:
Download App:
  • android
  • ios