సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం SSMB28. నేడు సోమవారం నుంచి షూటింగ్ మొదలైంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం SSMB28. నేడు సోమవారం నుంచి షూటింగ్ మొదలైంది. చాలా రోజుల తర్వాత త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న యాక్షన్ చిత్రం అంటూ ప్రచారం జరుగుతోంది. 

గతంలో మహేష్, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. అతడు విజయం సాధించగా ఖలేజా నిరాశపరిచింది. దీనితో ఈ మూడవ చిత్రంపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 

నేడు షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తొలిరోజు షూటింగ్ లో జరిగిన హైలైట్స్ చూపించారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ సెట్స్ లో షూటింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతుండగా ఎంట్రీ ఇస్తారు. 

సెట్స్ లో గన్స్ కూడా రెడీగా ఉన్నాయి. ప్రారంభించడమే యాక్షన్ ఎపిసోడ్ లో సినిమాని స్టార్ట్ చేసినట్లు ఉన్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ సన్నివేశం వివరిస్తుంటే శ్రద్దగా వింటున్నాడు. ఈ చిత్రంలో మహేష్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

 

YouTube video player