“సరిలేరూ నీకెవ్వరూ”బ్యాక్ డ్రాప్ అదే?
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం పూర్తి స్దాయి ఫన్ తో రూపొందుతోందని ఇప్పటికే వినపడుతోంది
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మికా మందన్నా హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం పూర్తి స్దాయి ఫన్ తో రూపొందుతోందని ఇప్పటికే వినపడుతోంది. అయితే చిత్రం బ్యాక్ డ్రాప్ మిలిట్రీ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో కథ జరుగుతుందని వినికిడి.
మహేష్ బాబు పాత్ర కర్నూల్ ప్రాంతానికి చెందిన వాడు అని, ఫ్యాక్షన్ హత్యలతో విసుగెత్తి మిలట్రీకు వెళ్తాడని చెప్తున్నారు. సినిమా ప్రారంభానికి అక్కడ నుంచి తన సొంత ఊరుకు రావటం, అక్కడ జరిగే పరిణామాలు చుట్టూ కథ తిరుగుతుందని చెప్తున్నారు. అయితే మరి పాత సినిమాల్లో చూపిన విధంగా ప్యాక్షనిజం చూపటం లేదని, కొంచెం కొత్తగా ఉంటుందని చెప్తున్నారు.
అందుకే మొదట్లో ఈ సినిమాకు రెడ్డిగారి అబ్బాయి అని టైటిల్ అనుకున్నారట. ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ కి గుర్తుగా చెప్పుకొనే కొండారెడ్డి బురుజు సెట్ లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. ఇదే కనుక నిజమైతే మహేష్ ని మొదటిసారి పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కథలో చూడటం జరుగుతుందన్నమాట.
ప్రస్తుతం ఈ సినిమా కోసం కర్నూల్లో ఫేమస్ కొండారెడ్డి బురుజు సెంటర్ను హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ స్టూడియోలో సెట్ వేశారు. సుమారు 4కోట్ల వ్యయం ఈ సెట్ కోసం చేసారని తెలిసింది. ఆ సెట్లోనే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. రాజేంద్రప్రసాద్, మహేశ్బాబు మధ్య కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాలో విజయ శాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు.