#Okkadu:'ఒక్కడు' రీరిలీజ్ ట్రైలర్, అదరకొట్టిందే
2023 జనవరికి ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. జనవరి 7, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో స్పెషల్ షోలు వేయబోతున్నట్లు తెలిపారు.
ఇప్పుడు రీరిలీజ్ ల సీజన్ నడుస్తోంది. ఒకప్పటి సూపర్ హిట్ చిత్రాలు అన్నీ రీరిలీజ్ లకు వస్తున్నాయి. అయితే అన్ని సక్సెస్ కావటం లేదు. ఏవో కొన్నిటిని మాత్రమే అభిమానులు ఆదరిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు మహేష్ బాబు మెగా హిట్ చిత్రం 'ఒక్కడు' రీరిలీజ్ వచ్చింది. జనవరి 7 నఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ట్రైలర్ ని సైతం కట్ చేసి రిలీజ్ చేసారు. ఆ ట్రైలర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మహేష్ అభిమానులు ఈ ట్రైలర్ చూసి , వింటేజ్ మహేష్ అంటూ మురిసిపోతున్నారు.ఆ ట్రైలర్ పై ఓ లుక్కేయండి..మీకు తెగ నచ్చేస్తుంది.
చిత్రం విషయానికి వస్తే... గుణశేఖర్ డైరెక్షన్ లో ఎం.ఎస్ రాజు నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కినా ఎం.ఎస్.రాజుకు మంచి లాభాలను అందించింది. మహేష్ కి భారీ కమర్షియల్ సక్సెస్ అందించి స్టార్ గా నిలబెట్టిన సినిమా 'ఒక్కడు' అని చెప్పాలి. ఈ మూవీలో భూమిక హీరోయిన్. జనవరి 15, 2003న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకొని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
2023 జనవరికి ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు అవుతున్న సందర్భంగా.. జనవరి 7, 2023న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో స్పెషల్ షోలు వేయబోతున్నట్లు తెలిపారు. నాలుగు నెలల ముందుగానే 'ఒక్కడు' రీరిలీజ్ ప్రకటన రావడంతో మహేష్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మహేష్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిన ఒక్కడు స్పెషల్ షో చూసేందుకు వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మరో ప్రక్క సంక్రాంతి సినిమాల కంటే మూడు రోజుల ముందు ఈ సినిమా థియేటర్లలో రీ రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాకు థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. మణిశర్మ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఒక్కడు మూవీలో మహేష్ కు జోడీగా భూమిక నటించారు. మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ రెగ్యులర్ షూట్ కు సంబంధించి త్వరలో అప్ డేట్ రానుంది.