షాక్ : 'మహర్షి' రిలీజ్ డేట్ మార్చటానికి కారణం అదేనా..?
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న మహర్షి చిత్రం రిలీజ్ డేట్ మళ్లీ మారిన సంగతి తెలిసిందే. ముందుగా ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ అవుతుందన్న నిర్మాతలు ఆ ఆ తర్వాత 26 అన్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న మహర్షి చిత్రం రిలీజ్ డేట్ మళ్లీ మారిన సంగతి తెలిసిందే. ముందుగా ఏప్రిల్ 5న మూవీ రిలీజ్ అవుతుందన్న నిర్మాతలు ఆ ఆ తర్వాత 26 అన్నారు. మళ్ళీ రీసెంట్గా 25న తప్పక విడుదల చేస్తామని అఫీషియల్గా ప్రకటించారు మళ్ళీ రిలీజ్ డేట్ మార్చారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఎందుకు మళ్లీ వాయిదా వేసారన్నది సినీ వర్గాల్లోనే కాక అభిమానుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
అయితే కష్టపడి పూర్తి చేసిన చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్వర్క్ హడావిడిగా చేయడం ఇష్టం లేదు. అందుకే మే 9న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం అని క్లారిఫై చేసారు దిల్ రాజు. కానీ అసలు కారణం అది కాదంటున్నారు కొందరు. ఈ సినిమా రీషూట్ల వల్ల ఆలస్యం అవుతోందని చెప్తున్నారు. సినిమాలోని కొన్ని ముఖ్యమైన సీన్లు మహేష్ బాబుకు నచ్చకపోవడంతో రీషూట్ కి వెళ్లాలని నిర్ణయించుకున్నారట. దిల్ రాజు కూడా రీషూట్స్ కు ఓకే అన్నారని, అందుకే ఈ రిలీజ్ డేట్ ని ముందుకు తోసారని చెప్తున్నారు.
ఇక మహర్షి చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశ్వినీదత్ నిర్మించిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి మే 9th వచ్చాయి. అలానే దిల్ రాజు బ్యానర్ లో పరుగు, భద్ర కూడా మే లో వచ్చాయి. ఈ సినిమాలన్నీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించాయి. ఈ క్రమంలో మేలో విడుదల కానున్న మహర్షి చిత్రం కూడా భారీ హిట్ కొడుతుందని అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది. అల్లరి నరేష్ గెస్ట్ రోల్లో కనిపించి సందడి చేయనున్నాడు. హై టెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నారు.