సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB 29( వర్కింగ్ టైటిల్). ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ SSMB 29( వర్కింగ్ టైటిల్). ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటివరకు పాన్ ఇండియాని శాసించిన రాజమౌళి.. మహేష్ బాబు చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు.
ఒరిస్సాలో ల్యాండ్ అయిన మహేష్ బాబు
ఇప్పటికే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక షెడ్యూల్ పూర్తయింది. ఇది ఇండోర్ లో జరిగిన షెడ్యూల్. తొలిసారి రాజమౌళి, మహేష్ బాబు అవుట్ డోర్ షెడ్యూల్ కోసం రెడీ అయ్యారు. తాజాగా రాజమౌళి, మహేష్ బాబు ఒరిస్సాలోని దట్టమైన అటవీ ప్రాంతం కోరాపుట్ లో ల్యాండ్ అయ్యారు. మహేష్ బాబు ఒరిస్సా పోలీసులతో కరచాలనం చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విలన్ గా పృథ్వీరాజ్ కంఫర్మ్
ఆసక్తికర విషయం ఏంటంటే మహేష్ బాబుతో మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు. గత కొంత కాలంగా పృథ్వీ రాజ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. కొన్ని వారాల క్రితం పృథ్వీరాజ్ ని మీడియా దీని గురించి అడిగినప్పుడు ఇంకా ఏది ఫైనల్ కాలేదు అని తెలిపారు. కానీ ఇప్పుడు ఒరిస్సాలో మహేష్ బాబుతో కలసి కనిపించడంతో రాజమౌళి చిత్రంలో అతడే విలన్ అని తేలిపోయింది.
చుట్టూ అడవులు, కొండలు ఉన్న ప్రాంతంలో రాజమౌళి, మహేష్ బాబు చిత్రానికి సంబంధించిన సెట్స్ కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ చిత్రం జంగిల్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ తో తెరకెక్కే చిత్రం అని ఆల్రెడీ ప్రకటించారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.