Asianet News TeluguAsianet News Telugu

నా ప్రేమ నీకు ఎప్పటికీ ఉంటుంది తారక్.. మహేష్ ఎమోషనల్ ట్వీట్!

నందమూరి హరికృష్ణ మరణంతో కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కళ్యాణ్ రామ్, తారక్ ఆసుపత్రికి చేరుకొని తమ తండ్రిని చూసుకొని కన్నీటిపర్యంతమయ్యారు.

mahesh babu condolences to harikrishna
Author
Hyderabad, First Published Aug 29, 2018, 11:13 AM IST

నందమూరి హరికృష్ణ మరణంతో కుటుంబంతో పాటు అభిమానులు విషాదంలో మునిగిపోయారు. కళ్యాణ్ రామ్, తారక్ ఆసుపత్రికి చేరుకొని తమ తండ్రిని చూసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. హరికృష్ణకి నివాళులు అర్పించిన మహేష్ బాబు.. ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

''సడెన్ గా హరికృష్ణ గారు మరణించడం ఎంతో బాధకు గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. నా బలం, ప్రేమ నీకు ఎప్పటికీ ఉన్నాయి బ్రదర్ తారక్'' అంటూ ట్వీట్ చేశారు. అలానే సినీ హీరోలు నాని, సందీప్ కిషన్, దర్శకుడు అనీల్ రావిపూడి, హారిక హాసిని క్రియేషన్స్ ఇలా విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ నందమూరి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ హరికృష్ణకి నివాళులు అర్పిస్తున్నారు. 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios