Asianet News TeluguAsianet News Telugu

నాన్నమ్మ మరణంతో వెక్కి వెక్కి ఏడ్చిన సితార, ఓదార్చిన మహేష్ బాబు, వైరల్ అవుతున్న వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో వరుస మరణాలు... ఆ కుటుంబాన్ని తీరని శోకంలో ముంచేశాయి. ఇక కృష్ణ సతీమణి, మహేష్ తల్లి ఇందిరాదేవి మరణంతో అంతా విషాదంలో ఉన్నారు. మహేష్ బాబు కూతురు సితార నాన్నమ్మ మరణాన్ని తట్టులేకపోయింది. వెక్కి వెక్కి ఏడ్చంది. 

mahesh babu comforted sitara cried after her grandmother death
Author
First Published Sep 28, 2022, 12:51 PM IST

నానమ్మ ఇందిరా దేవి మరణం తట్టుకోలేక పోయింది.. మహేష్ కూతురు సితార. దుఖాన్ని ఆపుకోలేక  వెక్కి వెక్కి ఏడ్చింది.  చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వీల్ చైర్ కే పరిమితం అయిన  మహేష్ తల్లి ఇందిరాదేవి ఈరోజు ఉదయం4 గంటలకు కన్నుమూశారు. ఆ బాధను దిగమింగుకుని.. సూపర్ స్టార్ మహేష్ బాబు అమ్మ పార్టీవ దేహం దగ్గర కూర్చోని ఉన్నారు. పరామర్శకు వస్తున్న సెలబ్రీటీలతో మాట్లాడుతూ ఉన్నారు. కాని  నానమ్మ మరణం తట్టుకోలేక పోయిన  మనవరాలు మహేష్ కూతురు సితార  మాత్రం బాధ తట్టుకోలేక పోతుంది. ఇందిరాదేవి భౌతికకాయం వద్ద మహేష్ ఒడిలో కూర్చుని గుక్క పెడుతూ ఏడ్చింది. 

నాన్ స్టాప్ గా ఏడుస్తున్న సితారను దగ్గరకు తీసు కుని మహేష్ ఎంత ఓదార్చారు. కాని .. సితార కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. మహేష్ కూతురికి నానమ్మ అంటే ఎంతో ప్రేమ. ఆమెను చూడటానికి తరచూ కూడా ఆమె ఇంటికి వెళ్లేది. అంతే కాదు నాన్నమ్యతో చాలా టైమ్ స్పెండ్ చేసి.. ఆమెతో ఫోటోలు దిగి.. వాటిని సోషల్ మీడియలో శేర్ చేసేది. అటువంటి నాన్నమ్మ ఇక లేదు అని తెలిసి ఏడుపు ఆపుకోలేక పోయింది సితార. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

మహేష్ కు తన తల్లి అంటే ప్రాణం.అంతే కాదు తన కూతురు సితార అచ్చం అమ్మలానే ఉంటుందని పలుమార్లు చెప్పాడు మహేష్.  బాలయ్య అన్ స్టాపబుల్ కి వచ్చినప్పుడు కూడా .. సీతా పాప అంటే ప్రాణం.. ఆమె  మాట ఇంట్లో శాససం అన్నారు. మా అమ్మ అమ్మమ్మే  సీతాపగా మా ఇంటికి వచ్చిందని అన్నారు. అటువంటి సితారకు నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. 

ఇక మహేష్ తల్లి మరణంతో సినీ పరిశ్రమలో సెలబ్రీలంతా పద్మాలయా బాట పట్టారు. ఇందిరా దేవి పార్ధీవ దేహానికి వరుసగా స్టార్లు నివాళి అర్పిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా చిరంజీవి, పవన్, చంద్రబాబు నాయుడ, తో పాటు బాలయ్య లాంటి ప్రముఖులు సంతాపం ప్రకటించగా.. డైరెక్ట్ గా వెళ్లి.. వెంకటేష్, రాఘవేంద్ర రావు, నాగార్జున, త్రివిక్రమ్, తమన్ లాంటి స్టార్లు నివాళి అర్పించారు.  ఈ రోజు మధ్యహ్నం మహా ప్రస్థనంలో ఆమె అంత్య క్రియలు జరుగుతాయని సమాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios