మెచ్చుకున్న మహేశ్,తెగ షేర్ చేస్తున్న ఫ్యాన్స్
ఈ లాక్డౌన్ సమయంలోనూ శ్రుతి సంగీతంపైనే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా శ్రుతి ‘ఎడ్జ్’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. అందులో ‘టేక్ మి టేక్ మి టు ఎడ్జ్..’ అనే సాంగ్ను శ్రుతి విడుదల చేశారు. ప్రతి ఒక్కరిలో అసంపూర్ణమైన ప్రేమను తెలియజేప్పే ప్రయత్నమే ఇది అని శ్రుతి తెలిపారు. ఈ ఆల్బమ్కు శ్రుతిహాసన్ సంగీతం సమకూర్చడంతో పాటు పాడారు కూడా.
సౌత్, నార్త్ తేడా లేకుండా తన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందం శ్రుతిహాసన్ ఒకరు. అయితే చాలా మందికి తెలియని విషయం ఈమె హీరోయిన్ కావడానికి ముందు మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేసింది. ఆమె పాప్ సంగీత రంగంలో ప్రవేశించి తన మ్యూజిక్ బ్యాండ్ తో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. దాంతో ఇప్పటికి ఏమాత్రం ఖాళీ దొరికినా మ్యూజిక్ షోస్ చేయడానికి శ్రుతి హాసన్ ఆసక్తి చూపుతుంటారు.
ఈ లాక్డౌన్ సమయంలోనూ శ్రుతి సంగీతంపైనే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా శ్రుతి ‘ఎడ్జ్’ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేశారు. అందులో ‘టేక్ మి టేక్ మి టు ఎడ్జ్..’ అనే సాంగ్ను శ్రుతి విడుదల చేశారు. ప్రతి ఒక్కరిలో అసంపూర్ణమైన ప్రేమను తెలియజేప్పే ప్రయత్నమే ఇది అని శ్రుతి తెలిపారు. ఈ ఆల్బమ్కు శ్రుతిహాసన్ సంగీతం సమకూర్చడంతో పాటు పాడారు కూడా.
తాజాగా శ్రుతిహాసన్ 'ఎడ్జ్' అనే సింగిల్ సాంగ్ రూపొందించారు. శ్రుతి గళం నుంచి జాలువారిన ఈ గీతం ఆన్ లైన్ లో ఊపేస్తోంది.
పాశ్చాత్య బాణీల్లో స్వరపరిచిన ఈ పాట టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును కూడా ఆకట్టుకుంది. ఈ పాటను ఎంతో ఇష్టపడుతున్నాను అంటూ మహేశ్ ట్వీట్ చేశారు. కంగ్రాచ్యులేషన్స్ శ్రుతిహాసన్... నువ్వు ఆలపించిన 'ఎడ్జ్' పాటను విన్నాను.. ఊపేసేయ్! అంటూ ప్రోత్సహించారు.
'ఎడ్జ్' పాట పూర్తిగా ఆంగ్లంలో సాగుతుంది. ఈ గేయానికి సాహిత్యం కూడా శ్రుతిహాసనే సమకూర్చింది. మహేష్ మెచ్చుకోవటంతో మహేష్ ఫ్యాన్స్ అంతా ఆ పాటను తెగ షేర్ చేస్తున్నారు. తమ హీరో మెచ్చుకున్న మ్యాటర్ తమ వంతుగా జనాల్లోకి తీసుకెళ్లాదని వాళ్ళ ఆలోచన. అలా మహేష్ ...తనతో నటించిన శృతి హాసన్ కు బూస్ట్ ఇచ్చారన్నమాట.