సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీపై కన్నేసిన ధోని, మహేష్ బాబు, విజయ్ దళపతితో సినిమాలు నిర్మించనున్న స్టార్ క్రికెటర్
క్రికెటర్ గా స్టార్ డమ్ సాధించి.. తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు మహేంద్రసింగ్ థోనీ. ఇక ఆయన రీసెంట్ గా నిర్మాతగా మారి సినిమాల వైపు వచ్చాడు. బాలీవుడ్ పై పెద్దగా దృష్టి పెట్టకుండా సౌత్ స్టార్ల వైపు చూస్తున్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా మారాడు. ఉత్తరాధికి చెందిన ఆయన.. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూడకుండా... సౌత్ స్టార్స్ వైపు చూస్తున్నాడు. దక్షణాది హీరోలతో సినిమాలు నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు స్టార్ ప్లేయర్. ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఇప్పటికే బాలీవుడ్ లో రోర్ ఆఫ్ లయన్, బ్లేజ్ టు గ్లోరీ, ద హిడెన్ హిందూ అనే మూడు షార్ట్ ఫిల్మ్స్ చేసిన ధోనీ.. తన భార్యకు తన నిర్మాణ సంస్థ బాధ్యతలను అప్పగించారు.
క్రికెటర్ గా ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో నటించాడుథోని. అది ఆయన్ను సినిమా రంగం వైపు ఆకర్షించింది.అంతే కాదు ఆయన బయోపిక్ మూవీ సూప్ సక్సెస్ అవ్వడంతో.. మూవీ ఫీల్డ్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఇక సినిమాలకుసబంధించిన ఈవెంట్స్ కు ఎక్కువగా వెళ్ళడం.. అందులో లోటు పాట్లను గమనించాడు ధోని. దక్షణాదిన తెలుగు,తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇందులో భాగంగా తమిళ హీరో విజయ్తో ధోనీ ఓ సినిమా చేయడానికి అంగీకారం కుదుర్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షణ్ లో విజయ్ సినిమా చేస్తున్నాడు. ధోనీలక్కీ నెంబర్ 7 కావడంతో.. విజయ్ 70 వ సినిమాను ధోనీ ప్రొడ్యూస్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అలాగే కన్నడ లోనూ పేరున్న హీరోలతో సినిమా చేయబోతున్నారు ధోని.
ఇక మన టాలీవుడ్ విషయానికి వస్తే.. తెలుగులో ధోనీ నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తారనే ప్రచారం జరుగుతున్నది. సూపర్ స్టార్ తో సినిమా చేయాలి అంటే.. త్రివిక్రమ్ సినిమా అయిపోవాలి... తరువాత రాజమౌళి సినిమా అయిపోవాలి.. తరువాత ధోని దగ్గరకు ఛాన్స్ వస్తుంది. మరి ఈ మధ్యలో ఏం జరుగుతుందో చూడాలి. ఒక్క సారి రాజమౌళి సినిమాలోకి ఎంటర్ అయితే.. ఇంకో సినిమాలోకి వెళ్లడానికి కుదరదు.. మరి విజయ్ సినిమా తరువాత కన్నడ,మలయాళ భాషలు చూసుకుని.. తరువాత మహేష్ దగ్గరకు ధోని వచ్చే అవకాశం కనిపిస్తోంది.