'శ్రీదేవి సోడా సెంటర్' మూవీపై మహేష్ బాబు, కేజీఎఫ్ డైరెక్టర్ రివ్యూ!
సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ శుక్రవారం ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి.
సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ శుక్రవారం ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చింది. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. సుధీర్ బాబు నటనని అంతా మెచ్చుకుంటున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రంపై స్పందించారు. సుధీర్ బాబు సినిమా కాబట్టి మహేష్ స్పందించడం లో ఆశ్చర్యం లేదు. కానీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా 'శ్రీదేవి సోడా సెంటర్ చిత్రంపై కామెంట్స్ చేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
శ్రీదేవి సోడా సెంటర్ రా అండ్ ఇంటెన్స్ మూవీ. క్లైమాక్స్ బలంగా హద్దుకుంటుంది. పలాస తర్వాత కరుణ కుమార్ మరో బోల్డ్ మూవీతో వచ్చారు. సుధీర్ బాబు బెస్ట్ పెర్ఫామెన్స్ ని ఈ చిత్రంలో చూడవచ్చు. హీరోయిన్ ఆనంది, నరేష్ కూడా బాగా నటించారు' అని మహేష్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం చూశాక కామెంట్స్ చేశారు.
ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఈ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్ర నిర్మాత విజయ్ చిల్లాని ఉద్దేశిస్తూ.. మై డియర్ ఫ్రెండ్.. విజయ్ చిల్లా మీ చిత్రం గురించి గొప్పగా వింటున్నా. దర్శకుడు కరుణ కుమార్, చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు. సుధీర్ బాబు మీరు అద్భుతంగా ఉన్నారు అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు.