సూపర్స్టార్ మహేష్ హీరోగా.. సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్వైడ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మొదటి పాటను శుక్రవారం విడుదల చేశారు.
సూపర్స్టార్ మహేష్ హీరోగా.. సూపర్హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్వైడ్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మొదటి పాటను శుక్రవారం విడుదల చేశారు.
'ఛోటి ఛోటి చోటి ఛోటీ బాతే.. మీటి మీటి మీటి మీటీ యాదే.. ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే.. ఈ చెలిమికే కాలమే చాలదే...' అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీ ప్రసాద్ స్వీయ సంగీత సారధ్యంలో గానం చేశారు. స్నేహంలోని మాధుర్యాన్ని ఎంతో అందమైన పదాలతో శ్రీమణి పాటగా మలిచిన తీరు బాగుంది.
ఇక పాట రిలీజైన కొన్ని గంటలకే 2 మిళియన్స్ వ్యూస్ దగ్గరకు చేరుకుంటోంది. ఈ పాటకు శ్రోతల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రతి వారం ఒక పాట విడుదల చేయబోతున్నారు.
దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్ మూవీకి కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఇక సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

