48 కోట్లతో లగ్జరీ హౌస్ కొన్న బాలీవుడ్ సీనియర్ హీరోయిన్..
ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్ వరుసబెట్టి ఇల్లులు కొంటున్నారు. కొంత మంది స్టార్స్ ఇల్లు అమ్ముతున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కూడా ఓ కొత్త ఇల్లు కొన్నారు.
ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్ వరుసబెట్టి ఇల్లులు కొంటున్నారు. కొంత మంది స్టార్స్ ఇల్లు అమ్ముతున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కూడా ఓ కొత్త ఇల్లు కొన్నారు.
బాలీవుడ్ లో స్టార్స్ వరుసగా ఇల్లు కొంటున్నారు. యంగ్ స్టార్స్ దగ్గర నుంచి సీనియర్ స్టార్స్ వరకూ చాలా మంది లగ్జరీ ఇళ్లనుకొనుగోలు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ ముంబైలో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసింది. ఆ అపార్ట్మెంట్ కోసం ఆమె దాదాపుగా 48 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇండియాబుల్స్ బ్లూ ప్రాజెక్టులో ఈ ప్లాట్ ను ఆమె కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 8వ తేదీన ఆ ప్రాపర్టీని రిజిస్టర్ చేశారు.
బాధురీ దీక్షిత్ ఈ బిల్డింగ్లోని 53వ ఫ్లోర్లో ప్లాట్ ను కొన్నారు. అది సుమారు 5384 చదరపు గజాలు ఉంటుందని అంచనా. అంతే కాదు దీని కోసం ఏకంగా ఏడు కార్ల పార్కింగ్ స్థలాన్ని కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాలెస్ ల్యాండ్ డెవలప్మెంట్ ఈ అపార్ట్మెంట్ అమ్మింది. మాధురీ దీక్షిత్ ఖరీదు చేసిన అపార్ట్మెంట్ నుంచి నేచర్ అద్భుతంగా కనిపిస్తుందట. ముఖ్యంగా ఈ ప్లాట్ నుంచి అరేబియా సముద్రం అద్భుతంగా కనిపిస్తుందని ఇండియాబుల్స్ బ్లూ తన వెబ్సైట్లో తెలిపింది. ఇండియాబుల్స్ తన ఇన్స్టాగ్రామ్లో ఇంటి ఫోటోలను అప్లోడ్ చేసింది.
ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక బాలీవుడ్ లో డ్రీమ్ గర్ల్ గా మాధురీ దీక్షిత్ ఒక ఊపు ఊపింది. సీనియర్ హీరోలసరసన నటించి మెప్పించి కోట్లలో అభిమానుల ప్రేమను చూసింది. అంతే కాదు మాధురి డాన్స్ కు ఆమె బ్యూటీకి అప్పట్లో కుర్రకారు ఉర్రూతలూగింది. ప్రస్తుతం ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.