'భాగమతి' తరువాత అనుష్క నుండి మరో సినిమా ప్రకటన రాలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్ మీనన్ తో సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. గౌతమ్ మీనన్ కూడా తన తమిళ సినిమాతో బిజీ అయిపోయాడు.

'భాగమతి' తరువాత అనుష్క నుండి మరో సినిమా ప్రకటన రాలేదు. మధ్యలో దర్శకుడు గౌతమ్ మీనన్ తో సినిమా ఉంటుందనే వార్తలు వినిపించాయి. కానీ దానిపై ఎలాంటి ప్రకటన రాలేదు. గౌతమ్ మీనన్ కూడా తన తమిళ సినిమాతో బిజీ అయిపోయాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దీంతో అనుష్క తదుపరి సినిమా విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఈరోజు అనుష్క పుట్టినరోజు సందర్భంగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు ప్రముఖ రచయిత కోన వెంకట్. రచయితగా తన క్రేజ్ తగ్గడంతో నిర్మాణ రంగంలోకి దిగి కాంబినేషన్లు సెట్ చేయడం, సినిమాలకి సమర్పకుడిగా వ్యవహరించడం వంటివి చేస్తూ లాభాల్లో వాటా తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో అతడు మరో కాంబినేషన్ సెట్ చేశాడు. మాధవన్, అనుష్క జంటగా 'వస్తాడు నా రాజు' ఫేం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు. గతంలో మాధవన్, అనుష్క కలిసి 'రెండు' అనే సినిమాలో నటించారు. ఆ తరువాత మళ్లీ కలిసి నటించలేదు.

ఇన్నాళ్లకి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళబోతుంది. దీనికి కోన సమర్పకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. వచ్చే ఏడాది అమెరికాలో సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు వెల్లడించారు. 

Scroll to load tweet…