Asianet News TeluguAsianet News Telugu

MAA elections:ప్రకాష్ రాజ్ ప్యానెల్  నుండి ముగ్గురు విజయం

మా ఎన్నికల తొలిపలితం వచ్చేసింది. దానిలో బాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా పోటీ చేసిన శివా రెడ్డి, కౌశిక్ రెడ్డి, సురేష్ కొండేటి  విజయం సాధించించారు. 

maa elections three members got win from prakash raj panel
Author
Hyderabad, First Published Oct 10, 2021, 7:03 PM IST

మా ఎన్నికలు ఫలితాలు వెలువడుతున్నాయి. మా ఎన్నికల తొలిపలితం వచ్చేసింది. దానిలో బాగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా పోటీ చేసిన శివా రెడ్డి, కౌశిక్ రెడ్డి, సురేష్ కొండేటి  విజయం సాధించించారు. మిగిలిన 15 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఫలితాలు రావాల్సి ఉంది. 


మొదటి ఫలితం తమకు అనుకూలంగా రావడంతో ప్రకాష్ ప్యానెల్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విష్ణు ప్యానెల్ నుండి 10 మంది లీడ్ లో ఉన్నారని సమాచారం అందినప్పటికీ, మొదటి ఫలితం ప్రకాష్ రాజ్ కి అనుకూలంగా వచ్చింది. అత్యధిక మెజారిటీతో శివారెడ్డి గెలుపొందినట్లు తెలుస్తుంది. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి పోటీ చేసిన అనసూయ సైతం లీడ్ లో ఉన్నట్లు సమాచారం అందుతుంది. 


మా ఎన్నికలలో మంచు విష్ణు గెలవడం ఖాయం అని.. ప్రాధమిక సమాచారం వచ్చినప్పటికీ.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి అభ్యర్థులు గెలుపొందడం ఉత్కంఠ రేపుతోంది. కాబట్టి అనుకున్నట్లుగా ఫలితాలు ఉంటాయని మనం చెప్పలేం. ప్రకాష్ రాజ్, మంచు విష్ణులో విజయం ఎవరిదైనా కావచ్చు. 

ఈసారి ఎన్నికలో ఆ సంఖ్య ఏకంగా 600 కి చేరింది. 600 మించి ఓట్లు నమోదు అవుతాయని తెలుస్తుంది. ఇతర పరిశ్రమలకు చెందిన నిత్యామీనన్, ప్రియమణి, జెనిలియా వంటి హీరోయిన్స్ ఎన్నికల్లో పాల్గొనడం విశేషం. మరో వైపు మంచు విష్ణు ప్యానెల్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios