Asianet News TeluguAsianet News Telugu

మోహన్ బాబు గారూ! మా భవనంపై నరేష్ ను నిలదీయండి: నాగబాబు

2017లో అధ్యక్షుడుగా ఉన్న శివాజీ రాజా, సెక్రెటరీగా ఉన్న నరేష్ 90లక్షల విలువ చేసే మా బిల్డింగ్ కేవలం 30లక్షలకు విక్రయించారని నాగబాబు ఆరోపిస్తున్నారు. 

maa elections heat nagababu strong counter to mohan babu and naresh
Author
Hyderabad, First Published Sep 9, 2021, 11:49 AM IST

'మా' సభ్యులం, సినిమా కళామ బిడ్డలు, మేమందరం ఒక్కటే..అని నటులు చెప్పే ఈ నినాదాలలో నిజం లేదని మా ఎలక్షన్స్ హీట్ ద్వారా తెలుస్తుంది. రెండు నెలలుగా మా సభ్యుల మధ్య వాదోపవాదాలు, వాడివేడి ఆరోపణలు నడుస్తున్నాయి. ఈసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ కి సప్పోర్ట్ గా ఉన్న నాగబాబు, సోషల్ మీడియా వేదికగా ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, మోహన్ బాబులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

ఎలక్షన్స్ నేపథ్యంలో మా బిల్డింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఇంతవరకు మా బిల్డింగ్ ఎందుకు నిర్మించలేక పోయారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మంచు విష్ణు సొంత డబ్బులతో బిల్డింగ్ నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఉన్న పాత బిల్డింగ్ అంశం తెరపైకి తెచ్చిన నాగబాబు,  అధ్యక్షుడు నరేష్ తో పాటు మోహన్ బాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 

2017లో అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా, సెక్రెటరీగా ఉన్న నరేష్ 90లక్షల విలువ చేసే మా బిల్డింగ్ కేవలం 30లక్షలకు విక్రయించారని నాగబాబు ఆరోపిస్తున్నారు. 90లక్షల విలువ అంచనా వేసిన బిల్డింగ్ కేవలం 30.9 లక్షలకు అమ్మడం వెనుక కారణం ఏమిటో అప్పుడు సెక్రెటరీగా ఉన్న నరేష్ ని, అధ్యక్షుడు శివాజీ రాజాను మోహన్ బాబు అడగాలని నిలదీశారు. 

మార్కెట్ వాల్యూ కంటే అతి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఆడిటర్ తనతో అన్నట్లు నాగబాబు గుర్తు చేసుకున్నారు. చివరకు అమ్మిన ధరలోనే రిజిస్ట్రేషన్స్ చార్జెస్ కూడా భరించి, తక్కువ ధరకు అమ్మారని విమర్శలు చేశారు.  రాబోయే ఎన్నికల్లో శ్రీకృష్ణుడు పాత్ర వహిస్తాను అంటున్న నరేష్ మీ క్యాంపైన్ లోనే ఉన్నారు. ఆయన్నే తక్కువ ధరకు మా బిల్డింగ్ ఎందుకు అమ్మారో అడిగి తెలుసుకోవాలని మోహన్ బాబును నిలదీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios