Asianet News TeluguAsianet News Telugu

`వాల్తేర్‌ వీరయ్య` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి లైన్‌ క్లీయర్.. వేదిక మారింది..

చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి అనేక అవాంతరాల అనంతరం ఎట్టకేలకు వెన్యూ ఫిక్స్ అయ్యింది. మరో వేదికన ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు.

line clear for waltair veerayya pre release event with venue change
Author
First Published Jan 7, 2023, 8:13 PM IST

ఏపీ ప్రభుత్వం నుంచి సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్లకి సంబంధించిన తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. నిన్న బాలకృష్ణ నటించిన `వీరసింహారెడ్డి` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషయంలోనూ అదే జరిగింది. చిత్ర యూనిట్‌ నిర్వహించాలనుకున్న వెన్యూకి పర్మిషన్‌ ఇవ్వలేదు, దీంతో మరో చోట నిర్వహించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని వైజాగ్‌లోని ఆర్కే బీచ్‌లో నిర్వహించబోతున్నట్టు యూనిట్‌ ప్రకటించింది. 

కానీ నిర్మాతలకు షాకిచ్చారు పోలీసులు. పర్మిషన్‌ ఇవ్వలేదు. మొదట అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఓకే అన్నారనే సమాచారం వచ్చింది. మళ్లీ ఏపీ ప్రభుత్వం నుంచి అభ్యంతరం చివరికి వెన్యూ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌కి మార్చాల్సి వచ్చిందట. ఫైనల్‌గా ఈ వేదికని ఫిక్స్ చేసినట్టు తెలిపింది యూనిట్‌. అయితే ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కి నిర్మాతలు థ్యాంక్స్ చెప్పడం విశేషం. పర్మిషన్‌ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు యూనిట్‌ ఏపీ సీఎంకి ధన్యవాదాలు తెలిపారు. 

మొత్తానికి రేపు(జనవరి 8న) వైజాగ్‌లోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ గ్రౌండ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన `వాల్తేర్‌ వీరయ్య` ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగబోతుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. దీనికోసం యూనిట్‌ భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో చిరంజీవితోపాటు రవితేజ, శృతి హాసన్‌, దర్శకుడు బాబీ, నిర్మాతలు, ఇతర చిత్ర బృందం పాల్గొనబోతుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. హిందీలోనూ దీన్ని రిలీజ్‌ చేస్తుండటం విశేషం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios