లైగర్ సినిమాకు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డ్, అసలు సీన్లకే ఎసరు పెట్టారుగా...?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా సినిమా లైగర్. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ లో అంచనాలు పెంచిన ఈ సినిమా.. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక తాజాగా లైగర్ సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్ట్ లైగర్ సినిమాకు గట్టి షాక్ ఇచ్చినట్టు సమాచారం.
యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించిన తాజా సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇర ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర లౌగనక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ ఓ బాక్సర్ పాత్రలో నటిస్తుండటంతో రౌడీ హీరో అబిమానులు ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకు భాగస్వామి కావడంతో బాలీవుడ్ లో లైగర్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ కు పదును పెట్టారు. విజయ్, అనన్య కలిసి దేశమంతా తిరుగుతున్నారు. ఇక లైగర్ కు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. సెన్సార్ బోర్డు లైగర్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ను జారీ చేశారని సమాచారం.
ఇక ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు లైగర్ టీమ్కు భారీ షాకిచ్చారట. ఈ సినిమాలో కొన్ని అభ్యంతకరమైన సీన్స్ ఉన్నాయని.. వాటిని పూర్తిగా తొలిగించాల్సిందిగా సెన్సార్ బోర్డు ఆదేశించినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. బోల్డ్ డైలాగులు, హాట్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక పూరీ డైరెక్టర్ అంటే.. ఆయనలో ఉన్న ఊరమాస్ డైరెక్టర్ తోడవ్వడంతో, లైగర్ సినిమాలో ఎఫ్ డైలాగ్స్ గట్టిగా పడ్డాయట. దీంతో వాటిని తీసేయ్యాలని సెన్సార్ టీమ్ గట్టిగా చెప్పేశారట.
షాకింగ్ విషయం ఏంటీ అంటే..లైగర్ కు బాగా ఉపయోగపడే సన్నీవేశాలు.. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు సీన్లను సినిమా నుంచి తీసేయాల్సిందిగే నెస్సార్ బోర్ట్ చెప్పిందట. ఇక సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఆయా సీన్స్ను తొలగించి లైగర్ టీమ్ మూవీని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి లైగర్ సినిమాలో ఇంకా అలాంటి బోల్డ్ సీన్స్ ఏముంటాయా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో.. ముఖ్యంగా రౌడీ ఫ్యాన్స్లో నెలకొంది. ఇక ఈ సినిమాలోరమ్యకృష్ణ, మైక్ టైసన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.