'RRR' పై లేటెస్ట్ అప్డేట్.. తారక్ ట్వీట్!
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న భారీ చిత్రం 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన భారీ షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న భారీ చిత్రం 'RRR'. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన భారీ షెడ్యూల్ ని మొదలుపెట్టనున్నారు. దీనికోసం తారక్ గుజరాత్ లోని వడోదర నగరానికి వెళ్తున్నారు.
ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. విమాన టికెట్ ఫోటోని అభిమానులతో పంచుకున్నారు. 'RRR' భారీ షెడ్యూల్ కోసం బయలుదేరుతున్నా అంటూ తారక్ ట్వీట్ చేశాడు.
ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు 'హ్యాపీ జర్నీ అన్నా.. మాకు ఇలానే అప్డేట్స్ ఇస్తూ ఉండు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో హీరోయిన్లు కూడా జాయిన్ అవుతారని సమాచారం.
ఇక సినిమా విషయానికొస్తే.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో డీవీవీ దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. 2020 జూన్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Off to a flying start!Big schedule ahead.#RRR pic.twitter.com/f82ksuIWR6
— Jr NTR (@tarak9999) March 28, 2019