Asianet News TeluguAsianet News Telugu

అనారోగ్యం పాలైన లేట్ దిలీప్ కుమార్ భార్య సైరాబాను.. ఐసీయూలో చికిత్స!

రక్తపోటుతో బాధపడుతున్న సైరాబానును కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం ముంబై హిందుజా ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. ఆమె ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో వైద్యులు ఐసీయూకి తరలించారు. సైరాబానుకు హిందుజా వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. 
 

late dilip kumar wife sairabanu hospitalized shifted to icu
Author
Hyderabad, First Published Sep 1, 2021, 2:48 PM IST

లెజెండరీ నటుడు దిలీప్ కుమార్ వైఫ్ సైరాబాను అనారోగ్యం బారినపడ్డట్లు సమాచారం అందుతుంది. రక్తపోటుతో బాధపడుతున్న సైరాబానును కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం ముంబై హిందుజా ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. ఆమె ఆరోగ్యం మెరుగుకాకపోవడంతో వైద్యులు ఐసీయూకి తరలించారు. సైరాబానుకు హిందుజా వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. 


ప్రస్తుతం సైరాబాను వయసు 77ఏళ్ళు కాగా, వృద్ధాప్య సంబంధింత రుగ్మతలతో బాధపడుతున్నారు. కాగా సైరా భర్త మొదటి తరం బాలీవుడ్ స్టార్ దిలీప్ కుమార్ జులై 7న మరణించడం జరిగింది. దిలీప్ కుమార్, సైరాబానులకు సంతానం కూడా లేకపోవడంతో, ఆమె కొన్నాళ్లుగా ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న సైరాబాను త్వరగా కోలుకోవాలని, అభిమానులు కోరుకుంటున్నారు. 


దిలీప్ కుమార్, సైరాబాను వివాహం అప్పట్లో ఓ సంచలనం. 44ఏళ్ల వయసులో ఉన్న దిలీప్ కుమార్ ని 22 ఏళ్ల సైరాబాను వివాహం చేసుకున్నారు. చిన్నప్పటి నుండి దిలీప్ కుమార్ సినిమాలు చూస్తూ, ఆయనను ఆరాధిస్తూ పెరిగిన సైరాబాను హీరోయిన్ గా మారాక, దిలీప్ కుమార్ నే భర్తగా పొందారు. 

Follow Us:
Download App:
  • android
  • ios