Asianet News TeluguAsianet News Telugu

క్రేజీ న్యూస్... 37 ఏళ్ల తరువాత రిపిట్ కాబోతున్న "లేడీస్ టైలర్" కాంబినేషన్

 తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో లేడీస్ టైలర్ ఒకటి. ఆ సినిమా వచ్చిన 37 ఏళ్లకు మళ్లీ  రాజేంద్ర ప్రసాద్,  అర్చన.. కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఓ కొత్త సినిమాలో సూపర్ హిట్ జోడీ నటిస్తోంది.
 

Ladies Tailor Rajendra Prasad And Archana Combo Repeat Again After 37years JMS
Author
First Published Apr 2, 2023, 12:30 PM IST

కొన్ని కాంబినేషన్లు ఎన్ని సంవత్సరాలైనా అలా నిలిచిపోతాయి. ఎన్నాళ్లైనా గుర్తుండిపోతాయి. అలా ఎవర్ గ్రీన్ అవ్వడానికి వందల సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమా చేస్తే చాలు. అది సరిగ్గా క్లిక్ అయితే చాలు. ఆడియన్స్ కు బాగా నచ్చితే చాలు. ఆ సినిమా ఎన్నేళ్లైనా అలా ఉండిపోతుంది. అటువంటి సినిమానే లేడీస్ టైలర్. ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబోకి ఎంత పేరు వచ్చింది అందరికి తెలిసిందే.. ఈ కాంబో మరోసారి రిపీట్ కాంబోతోంది. అది కూడా 37 ఏళ్ళ తరువాత. 

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన... ఈ జోడీ పేర్లు వింటే లేడీస్ టైలర్ సినిమా గుర్తుకు వస్తుంది. సుజాతా..మై మర్ జాతా డైలాగును, ఆ సన్నివేశాన్ని, ఆ సినిమాను అంత త్వరగా ఎవరు మర్చిపోతారు?  తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదొకటి. ఆ సినిమా వచ్చిన 37 ఏళ్లకు మళ్లీ  రాజేంద్ర ప్రసాద్,  అర్చన.. కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఓ కొత్త సినిమాలో సూపర్ హిట్ జోడీ నటిస్తోంది.

ముప్పై ఏడేళ్ల కిందట వచ్చిన లైడీస్‌ టైలర్‌ సినిమాను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు హాస్యప్రియులు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో రికార్డు కలెక్షన్‌లు కొల్లగొట్టింది. ఒక కామెడీ సినిమాకు ఆ స్థాయిలో కలెక్షన్‌లు రావడం చూసి సినీ విశ్లేషకులు సైతం ఆశ్చర్యంలో పడ్డారు. కలెక్షన్‌ల మాట అటుంచితే ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌, అర్చన జోడీకి థియేటర్ లో క్లాప్స్ గట్టిగా పడ్డాయి. ఈ సినిమాలో వీళ్లిద్ధరి మధ్య సీన్స్‌ అన్ని ఓ రేంజ్‌లో పేలాయి. ఇక ఇన్నాళ్ళకు వీరి కాంబో రిపిట్ కాబోతోంది. 

రాజేంద్ర ప్రసాద్, అర్చన  ప్రధాన పాత్రల్లో MAA AAI ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షష్టిపూర్తి. రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు పవన్ ప్రభ దర్శకుడు. రూపేష్ కుమార్ చౌదరి నిర్మాత. చెన్నైలోని ఇసైజ్ఞాని ఇళయరాజా స్టూడియోస్‌లో ఈ రోజు పూజా కార్యక్రమాలతో  ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఇసైజ్ఞాని సంగీత దర్శకుడు ఇళయరాజా కెమెరా స్విచాన్ చేయగా... సూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరి క్లాప్ ఇచ్చారు.

సినిమా హీరో, నిర్మాత రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ ''రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజా వంటి లెజెండ్స్‌తో సినిమా చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. 'లేడీస్ టైలర్' తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన గారు చేస్తున్న చిత్రమిది. 'లేడీస్ టైలర్' తర్వాత రాజేంద్ర ప్రసాద్, ఇళయరాజా కాంబినేషన్‌లో 'ఆస్తులు అంతస్థులు', 'చెట్టు కింద ప్లీడర్', 'ఏప్రిల్ 1 విడుదల' వంటి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ కాంబినేషన్ కూడా రిపీట్ అవుతోంది. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇదొక న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా. ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. జూలైలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని చెప్పారు. ఇక ఈసినిమాో రాజేంద్ర ప్రసాద్, అర్చన తో పాటు..  రూపేష్ కుమార్ చౌదరి, ఆకాంక్షా సింగ్, 'కాంతార' ఫేమ్ అచ్యుత్ కుమార్, వై. విజయ, 'శుభలేఖ' సుధాకర్ తదితరులు నటిస్తున్న


 

Follow Us:
Download App:
  • android
  • ios