నేనేంటో నాకే తెలియదు, కానీ ప్రపంచాన్ని చూపించారు.. కుమారీ ఆంటీ ఎమోషనల్ స్పీచ్.. చదువుపై పద్యంతో రచ్చ..
సోషల్ మీడియాలో పాపులర్ అయిన కుమారీ ఆంటీ తాజాగా వేదికపై దుమ్మురేపింది. విజయ్ దేవరకొండ ముందు ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ వర్డ్స్ వెల్లడించింది.
కుమారీ ఆంటీ ఇటీవల కాలంలో ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. హైదరాబాద్లోని హైటెక్ సిటీ సమీపంలో ఆమె మధ్యాహ్న భోజనం(ఫుడ్ స్టాల్) ఏర్పాటు చేసి ఎంతో మంది ఆకలి తీర్చింది. ఆమె కొన్ని ఏళ్లుగా అక్కడ తన ఫుడ్ సెంటర్ని నడిపిస్తుంది. కానీ ఇటీవల ఆమెకి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ఆమెపై ఫోకస్ పెట్టడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన క్రేజ్ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారిపోయింది. సెలబ్రిటీ అయ్యింది. ఆమె తాజాగా `డిజిటల్ మీడియా ఫ్యాక్టరీ` ఈవెంట్లో పాల్గొంది. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ వంటి వారు గెస్ట్ లుగా హాజరైన ఈ ఈవెంట్లో ఆమె సందడి చేసింది. స్టేజ్ ఎక్కి తన ఆనందాన్ని, భావోద్వేగాన్ని పంచుకుంది. అంతేకాదు ఇన్స్పైర్ చేసే పద్యంతో అందరిని ఉర్రూతలూగించింది.
ఆమె మాట్లాడుతూ, షాక్ల మీద షాకులు నాకు మామూలుగా తగలడం లేదు. కానీ ఇంతటి పాపులారిటీని ఊహించలేదు. నేను ఎక్కడ ఉంటానో, ఏం చేస్తానో నాది నాకే తెలియదు. ప్రపంచం అంటే ఏంటో తెలియని నాకు ఈ రోజు ఇంత మందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్స్. ఆత్మవిశ్వాసం ఉంటే ముందుకు వెళ్లొచ్చు అని, చదువు లేదని ఎప్పుడూ బాధ పడుతూ ఉంటే, అలా బాధ పడవద్దని, భక్తికి ముక్తికి చదువులెందుకు. ఆత్మ శాంతి ఉంటే అదే ధైవమూ, చెరువులోనా చేపకెవరు ఈత నేర్పిరి.. ... `అంటూ ఆమె ఇన్ స్పైరింగ్ చేసే పద్యాన్ని చెప్పి అందరిని ఉర్రూతలూగించారు.
ఈ విషయాలు మా అమ్మమ్మ, నాన్నమ్మ నాకు నేర్పించారు. మనం పని నేర్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే, ప్రతిఫలం ఆశించకుండా ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుందని తెలిపారు. ఇది నేను ఎప్పుడూ ఊహించలేదు. ఆనాడు ఆ పెద్దలు చెప్పిన మాట వింటే ఎప్పటికైనా విజయం సాధించవచ్చని నా విషయంలో ఫ్రూవ్ అయ్యింది. పెద్దల మాట వింటే విజయమే కానీ, అపజయం ఉండదు` అని వెల్లడించింది కుమారీ ఆంటీ.