ఫస్ట్లుక్ షేర్ చేసిన కేటీఆర్ ,టీమ్ ఫుల్ ఖుషీ
ఆసుయంత్రం సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మల్లేశం'. ఎక్స్ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ యాన్ ఆర్డినరీ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్.
ఆసుయంత్రం సృష్టికర్త పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మల్లేశం'. ఎక్స్ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ యాన్ ఆర్డినరీ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. ఇందులో మల్లేశం పాత్రలో తెలుగు సినిమా హాస్యనటుడు ప్రియదర్శి నటిస్తున్నారు. ఈ సినిమాపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదట నుంచీ ఆసక్తి చూపుతూ వస్తున్నారు. ఆ మధ్యన ఈ చిత్ర టైటిల్ లోగోను ట్విటర్లో షేర్ చేసి చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా ఫస్ట్లుక్ విడుదల చేయగా.. తాజాగా కేటీఆర్ షేర్ చేశారు.
తెలంగాణకు చెందిన ''మల్లేశం: ఎక్స్ట్రార్డినరీ స్టోరీ ఆఫ్ యాన్ ఆర్డినరీ'' మ్యాన్ సినిమా ఫస్ట్లుక్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంతో ఈ చిత్రం టీమ్ చాలా ఆనందంగా ఉంది.\
స్టూడియో 99 ఫిల్మ్స్ బ్యానర్పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాజ్ ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ ఆర్, శ్రీ అధికారి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో మల్లేశం పాత్రలో ప్రియదర్శి నటిస్తున్నారు. అనన్య, ఝాన్సీ, చక్రపాణి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.
బాబు శాడిలాస్య ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. లక్ష్మణ్ ఆలే ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సౌండ్ డిజైనర్ నితిన్ లుకోస్ ఈ చిత్రానికి సౌండ్ డిజైన్ చేస్తున్నారు. మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తున్నారు. పెద్దింటి అశోక్ కుమార్ ఈ చిత్రానికి మాటలు రాస్తున్నారు. ప్రముఖ రచయిత గోరేటి వెంకన్న, చంద్రబోస్ ఈ చిత్రానికి పాటలు రాస్తున్నారు. వెంకట్ సిద్ధిరెడ్డి ఈ చిత్రానికి ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు.
Happy to present you the first look of #Mallesham #ExtraordinaryStoryOfAnOrdinaryMan from #Telangana
— KTR (@KTRTRS) February 3, 2019
Wishing @MalleshamMovie team all the very best! pic.twitter.com/Nvkx0N9ZWa