డిసెంబ‌ర్ 4న రాంచ‌ర‌ణ్ కొత్త సినిమా ధృవ ప్రి రిలీజ్ కార్య‌క్ర‌మం . ఈ కార్య‌క్ర‌మానికి  మఖ్య అతిధిగా మంత్రి కేటీ ఆర్  హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్  లో ప్రీ రిలీజ్ వేడుక కార్య‌క్ర‌మం

ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి.. కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన మరికొంతమంది హీరోలు కూడా ఈ వేడుకకు హాజరవుతారు. ‘ధృవ’ ఒక పోలీస్ స్టోరీ కావడంతో ప్రి రిలీజ్ వేడుకకు వేదికను కూడా అందుకు తగ్గట్లే ఎంచుకున్నారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. ఐతే ఎంతమంది వచ్చినా.. చరణ్ సినిమా వేడుకకు కేటీఆర్ రావడమే అతి పెద్ద విశేషం.

ఈ మధ్య తెలుగు ఫిలిం సెలబ్రెటీలతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు కేటీఆర్. తరచుగా సినిమా వాళ్లతో మీటింగ్స్ పెడుతూ.. పరిశ్రమ అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నాడు. రామ్ చరణ్ తో కేటీఆర్ కు మంచి సాన్నిహిత్యమే ఉంది. ఆ మధ్య 10 కే రన్ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ఐతే టాలీవుడ్లో ఓ పెద్ద సినిమా వేడుకకు కేటీఆర్ హాజరవడం ఇదే తొలిసారి. మరి ఈ వేడుకలో కేటీఆర్ ఏం మాట్లాడతాడో చూడాలి.