కియారా టాప్ తీయలేదు... మీ కళ్ళకు అలా కనిపిస్తుంది
కియారా బీచ్ లో టాప్ లేకుండా పడుకున్నట్లు ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలపై నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. ఎన్ని సార్లు టాప్ లేకుండా ఫోటోలు దిగుతావంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఫోటోగ్రాఫర్ డబూరత్నాని స్పందించారు.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫోటో షూట్స్ పై నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో సదరు ఫోటోలు తీసిన ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబూరత్నాని స్వయంగా స్పందించడం జరిగింది. మోస్ట్ ఫేమస్ ఫోటోగ్రాఫర్ డబూరత్నాని ఫోటో షూట్ లో పాల్గొనాలని ప్రతి సెలబ్రిటీ కోరుకుంటారు. సెలెబ్రిటీ ఎవరైనా వాళ్ళ అందాలు మరింత రెట్టింపు చేస్తూ, సరికొత్త కోణంలో ఆవిష్కరించే డబూరత్నాని కెమెరా ముందుకు వెళ్లాలని స్టార్స్ ఆరాటపడతారు.
టాలీవుడ్ నుండి ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మహేష్ వంటి వారు డబూరత్నాని ఫోటో షూట్ లో పాల్గొనడం జరిగింది. ఇక బ్యూటీ కియారా అద్వానీ రెండు మూడు సార్లు ఆయన ఫోటో షూట్ లో పార్టిసిపేట్ చేశారు. ఆకు చాటున నిల్చుని టాప్ లేకుండా కియారా ఇచ్చిన ఫోజు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. కాగా డబూరత్నాని 2021 క్యాలెండర్ కోసం బీచ్ లో కియారా పై ఫోటో షూట్ చేశారు.
ఆ షూట్ లో కియారా బీచ్ లో టాప్ లేకుండా పడుకున్నట్లు ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలపై నెటిజెన్స్ నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. ఎన్ని సార్లు టాప్ లేకుండా ఫోటోలు దిగుతావంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఫోటోగ్రాఫర్ డబూరత్నాని స్పందించారు. నెగిటివ్ కామెంట్స్ నా దృష్టికి కూడా వచ్చాయి. నిజానికి ఆ ఫోటోలలో కియారా టాప్ తీసేయలేదని, అది జస్ట్ కెమెరా ట్రిక్ అని తెలియజేశారు. చూసే వారి దృష్టిలోనే లోపం ఉంది కానీ, ఫొటోలో అశ్లీలత లేదని ఆయన కామెంట్ చేశారు.