ప్రభాస్ ను లైన్లో పెడితే మహేష్ బాబు కనెక్ట్ అయ్యాడు ఇటీవలే ప్రభాస్ కు మెసేజ్ పెట్టిన ధోనీ మూవీ హీరోయిన్ కియారా అద్వానీ మహేష్ బాబు, కొరటాల శివ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి చిత్రంలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్కి తెర పడిపోయినట్టే. దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న తన సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియా అద్వానీని ఫైనల్ చేశాడు. మొదట కీర్తి సురేష్ని అనుకున్నారు కానీ ఆమె కంటే కియారా బెటర్ ఆప్షన్ అని కొరటాల డిసైడ్ అయ్యాడట.
'ఎం.ఎస్.ధోని' చిత్రంతో బాలీవుడ్లో ఇన్స్టంట్ హిట్ అయిన ఈ సెక్సీ సుందరి మహేష్కి సరిజోడీలా వుంటుంది. స్టార్ హీరోయిన్లతోనే కాకుండా అడపాదడపా బాలీవుడ్ హీరోయిన్లని టాలీవుడ్కి మహేష్ పరిచయం చేస్తుంటాడు. ప్రీతిజింతా, సోనాలిబింద్రే, క్రితి సనన్, అమృతారావు, లీసారే, బిపాషా బసు తదితర బాలీవుడ్ హీరోయిన్లంతా మహేష్ చిత్రాలతోనే తెలుగు వారికి పరిచయమయ్యారు. ఇక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈభామ ఇటీవలే బాహుబలి ప్రభాస్ ను లైన్లో పెట్టేందుకు నేరుగా ఫోన్లో మెసేజ్ లు పెట్టిందట. ప్రభాస్ కూడా తనకు రిప్లై ఇచ్చాడన్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేయకున్నా... కొరటాల శివ ఓకే చేయటంతో సూపర్ స్టార్ మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది.
మొత్తానికి మహేష్ సినిమాకి హీరోయిన్ పరంగా ఎదురైన సమస్య తొలగిపోయింది కనుక ఈ చిత్రం మొదలవడమే ఆలస్యమన్నమాట. మహేష్ కోసమే కొరటాల ఎదురు చూస్తున్నాడు. అతను 'స్పైడర్' ఎప్పుడు ముగిస్తాడో అప్పుడు 'భరత్ అనే నేను' సెట్స్ పైకి వెళ్లిపోతుంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది ప్లాన్. ఆ ప్లాన్ వర్కవుట్ అవడానికి మే నెలాఖరునుంచి అయినా మహేష్ డేట్స్ దొరుకుతాయని కొరటాల చూస్తున్నాడు.
