లారీ కిందపడి ఏఏస్సై మృతి (వీడియో)
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని రఘునాథపాలెం లో పోలీస్ స్టేషన్ లో ఎఎస్సై గా పనిచేస్తున్న భాస్కర్ ఈ ప్్రమాదంలో మృతి చెందాడు. లారీ పైనుండి వెళ్లడంతో భాస్కర్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదూహాన్ని పరిశీలించారు. తమ సహచరుడు ఇంత దారుణంగా మృతి చెందడంతో పోలీసులు విషాదం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.