Asianet News TeluguAsianet News Telugu

'కేజీఎఫ్‌ 2' టీమ్ ధైర్యం,కరోనాను లెక్కచెయ్యం

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపధ్యంలో  ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందించటానికి ప్లాన్ చేసారు. అయితే కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు...ఈ సీక్వెల్ ప్రారంభించటానికి రంగం సిద్దమైంది.
 

KGF2 to resume shoot after Aug 15
Author
Hyderabad, First Published Aug 4, 2020, 8:48 AM IST

ఈ మధ్యకాలంలో ఆర్ ఆర్ ఆర్ స్దాయిలో క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టు ఏదైనా ఉంటే అది  'కేజీఎఫ్‌ 2' నే అని చెప్పాలి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్  డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపధ్యంలో  ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందించటానికి ప్లాన్ చేసారు. అయితే కరోనా వచ్చి దెబ్బ కొట్టింది. దాంతో షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు...ఈ సీక్వెల్ ప్రారంభించటానికి రంగం సిద్దమైంది.

అన్ని జాగ్రత్తలతో ..ఆగస్టు 15 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించబోతున్నారు.  ఓ మేజర్ పోర్షన్ పెండింగ్ ఉందని, దాన్ని ఫినిష్ చేసి,మిగతా పనుల్లో పడాలని టీమ్ భావిస్తోంది. కేవలం పదిహేను రోజులు మాత్రమే షూటింగ్ పెండింగ్ ఉందని, ఆగస్టు 30 నాటికి షూటింగ్ పూర్తైపోతుందనే ధైర్యం చేస్తున్నారట. ఒక్కసారి షూటింగ్ పూర్తైతే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు. నిర్మాతలు ఈ సినిమాని సంక్రాంతి 2021కు రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నట్లు కన్నడ సిని వర్గాల సమాచారం.  ఇప్పటికే ఈ చిత్రం పస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్టైంది. ఈ పాన్ ఇండియా చిత్రం ఫస్ట్ పార్ట్ ని మించి హై సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 

  ఇక ఈ చిత్రంలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టు పై క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఆ మధ్యన ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగింది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసారు. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. క్లైమాక్స్ కి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తారట. ఇక్కడ చిత్రీకరించే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios