కరోనా ఎఫెక్ట్.. 'కేజీఎఫ్ 2' లో యాక్షన్ సీన్స్కు కోత
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారంటూ వార్తలు సైతం వస్తున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రం ఫస్ట్ పార్ట్ ని మించి హై సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ప్రాజెక్టు ఏదైనా ఉంటే అది 'కేజీఎఫ్ 2' నే. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా గతంలో రూపొందిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. కేవలం కన్నడలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోను ఈ సినిమా వసూళ్లపరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శకుడు - హీరో ఇద్దరూ కలిసి రంగంలోకి దూకారు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ను మరింత భారీగా రూపొందిస్తున్నారంటూ వార్తలు సైతం వస్తున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రం ఫస్ట్ పార్ట్ ని మించి హై సక్సెస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
దసరాకు రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో ఇంకా రెండు యాక్షన్ సీక్వెన్స్ లు పెండింగ్ ఉన్నాయి. ఇవి మినహా మిగతా చిత్రం పూర్తైంది. దసరా కు ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో రెండు యాక్షన్ సీక్వెన్స్ లు ప్లాన్ చేయటం అంటే మాటలు కాదు. ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ తో ప్రతీది అతి జాగ్రత్తలు తీసుకుని చేయాల్సి వస్తోంది. దాంతో దర్శక, నిర్మాతలు కూర్చుని ఒక యాక్షన్ ఎపిసోడ్ ని స్కిప్ చేయాలని డిసైడ్ అయ్యనట్లు కన్నడ సినీ వర్గాల సమాచారం. ఆ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ ని సాధ్యమైనంత త్వరలో ఫినిష్ చేస్తారట. అంతేకాకుండా ఈ నిర్ణయం వెనక కేవలం కరోనా మాత్రమే కాక..ఎక్కువ యాక్షన్ పార్ట్ సినిమాలో ఉన్నా చూసేవాళ్లు డిస్ కనెక్ట్ అవుతారనే ఆలోచన ఉందని చెప్తున్నారు. ఈ ఆలోచనకు యష్ సైతం ఓకే చెప్పినట్లు వినికిడి.
ఇక ఈ చిత్రంలో విలన్ గా సంజయ్ దత్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టు పై క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ఆ మధ్యన ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగింది. అక్కడ కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసారు. చివరి షెడ్యూల్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. క్లైమాక్స్ కి సంబంధించిన కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తారట. ఇక్కడ చిత్రీకరించే యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. అయితే ఏం షూట్ చేసినా కరోనా ఎఫెక్ట్ తర్వాతే. అంటే మరికొంత సమయం పడుతుంది.