తాజా సమాచారం ప్రకారం, కీర్తి సురేష్ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు సరసన నటించబోతున్నారు. ఈ చిత్రం భారత విద్యా వ్యవస్థపై రూపొందనున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌ నటి కీర్తి సురేష్ తన వివాహం అనంతరం తొలి చిత్రాన్ని అధికారికంగా సైన్ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఆమె చాలా సినిమా చర్చల్లో పాల్గొన్నా, ఒక్కదాన్ని కూడా అధికారికంగా ఫైనల్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

తాజా సమాచారం ప్రకారం, కీర్తి సురేష్ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు సరసన నటించబోతున్నారు. ఈ చిత్రం భారత విద్యా వ్యవస్థపై రూపొందనున్నట్లు తెలుస్తోంది . ఇందులో కీర్తి సురేష్ ఒక ఎడ్యుకేటర్ పాత్రలో కనిపించనున్నారు. ఇదే కీర్తి సురేష్ తన వివాహం తర్వాత సైన్ చేసిన మొదటి సినిమా కావడం విశేషం.

కీర్తి సురేష్ తన బాల్య స్నేహితుడు ఆంటోని తటిల్ ను గత డిసెంబర్ 2024లో గోవాలో సంప్రదాయ రీతిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం కీర్తి తక్షణమే తన బాలీవుడ్ అరంగేట్ర చిత్రం ‘బేబీ జాన్’ ప్రమోషన్లలో పాల్గొన్నారు. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ, ఆమెకు ఇది రెండో బాలీవుడ్ సినిమా కావడం ఆమె కెరీర్‌లో మరో ముందడుగు.

ఇదిలా ఉండగా, కీర్తి ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల కోసం చర్చల్లో ఉన్నారు. వాటిలో ఒకటి సూర్య హీరోగా తెరకెక్కనున్న చిత్రం కాగా, దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టులపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశముంది.

కీర్తి సురేష్ వివాహం అనంతరం కూడా తన కెరీర్‌ను అదే ఊపుతో కొనసాగిస్తున్న తీరు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ఏకకాలంలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.