ఆ పాత్ర చేసినందకు దారుణంగా ట్రోల్ చేశారు, కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
తనపై వస్తున్న ట్రోల్స్ ను పట్టించుకునే అవసరం లేదు అంటోంది హీరోయిన్ కీర్తి సురేష్. తను మహానటి పాత్ర చేసినందకు దారుణంగా ట్రోల్ చేస్తారంటుంది బ్యూటీ. రీసెంట్ గా మరికొన్ని విషయాలు పంచుకుంది మలయాళ హీరోయిన్.
నానీ హీరోగా.. కీర్తిసురేష్ జంటగా నటించిన సినిమా దసరా. ఈమూవీ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈమూవీ పాన్ ఇండియ రేంజ్ లో 5 భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతుంది. దాంతో బాలీవుడ్ లో కూడాఈమూవీ టీమ్ ప్రమోషన్స్ ను జోరుగా సాగిస్తున్నారు. ఈ క్రమంలో దసరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహానటి సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలని గుర్తు చేసుకుంది కీర్తి సురేష్.
మహానటి సినిమాను అంగీకరించినందుకు మొదట్లో తాను ట్రోల్స్ ను ఎదుర్కొన్నానని కీర్తి సురేశ్ వెల్లడించింది. సావిత్రి పాత్రలో నటించడానికి ముందు తాను ఎంతో భయపడ్డానని చెప్పింది కీర్తి. అందుకే ఆ పాత్ర చేయడానికి ముందుగా నో చెప్పానంటోంది. మహానటి.. కీర్తి సురేశ్ కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఒక రకంగా చెప్పాలి అంటే మహానటి కి ముందు.. తర్వాత అన్నట్లుగా మారిపోయింది కీర్తి కెరరీర్. ఆ సినిమా ఆమెకు అంత పేరు తీసుకొచ్చింది.
మహానటి సినిమాలో నటించడానికి ముందు నో చెప్పానని అంటోంది కీర్తి.. కాని దర్శకుడు నాగ్ అశ్విన్ ధైర్యం చెప్పి ప్రోత్సహించడంతో చేయగలిగానంటోంది. నువ్వు కచ్చితంగా చేయగలవు.. నీకే సాధ్యం అవుతుంది అని దర్శకుడు ధైర్యం చెప్పారు. ఆయన నన్ను అంతగా నమ్మినప్పుడు.. నన్ను నేను ఎందుకు నమ్మకూడదనుకున్నా. అలా మహానటి పూర్తి చేశా అని వెల్లడించింది కీర్తి సురేష్.
మహానటి సావిత్రమ్మ పాత్ర చేయడం అంటే అంత ఈజీ కాదు. ఎంతో ఆలోచింది ఆ పాత్రను అంగీకరించాను.. అయినా సరే కొంత మంది నన్ను ట్రోల్ చేశారు. కానీ అది ముందు నాకు తెలియదని కీర్తి చెప్పుకొచ్చింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీపై వస్తున్న విమర్శల గురించి మీరు ఏమంటారు అని బాలీవుడ్ మీడియా అడిగిన ప్రశ్నకు కీర్తి సురేష్ ఈ విధంగా స్పందించింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కాని.. నెగిటివ్ కామెంట్లు కాని తాను పెద్దగా పట్టించుకోను అంటోంది బ్యూటీ.
ఇక మహానటి సినిమా షూటింగ్ విశేషాలు కూడా పంచుకుంది కీర్తి సురేష్. ఈసినిమా షూటింగ్ టైమ్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని కీర్తి తెలిపింది. సావిత్రమ్మ గారికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విపరీతమైన అభిమానులున్నారు.. మరి ఈ పాత్రలో వారిని మెప్పించగలనా అని భయపడ్డాను..అంటుంది కీర్తి. ఆ భయం పొగొట్టుకోవడం కోసం చాలా ప్రయత్నించాను.. ముందుగా ఆమె కుమార్తెని కలిసి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. సవాళ్లు, విమర్శలు ఎదురైనప్పటికీ సావిత్రమ్మ పాత్ర చేసినందుకు సంతోషంగా వుందని అంటుంది కీర్తి సురేష్. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దసరా సినిమాతో ఈనెల 30న ఆడియన్స్ ముందుకు రాబోతోంది కీర్తి సురేష్. ఈసినిమా తరువాత కీర్తికి తెలుగులో మరో సినిమా లేదు. తమిళంలో మాత్రం నాలుగు సినిమాలు చేయబోతోంది కీర్తిసురేష్. దసరాసినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టి.. బాలీవుడ్ లోకూడా పాగా వేయాలని చూస్తోంది. మరి దసరా సినిమా సక్సెస్ ను బట్టి టాలీవుడ్ లో... కీర్తి వైభవం మరోసారి తెలే అవకాశం ఉంది.