బాలీవుడ్ లో దేశభక్తికి సంబంధించిన సినిమా కథలతో ఎక్కువగా సినిమాలను తీస్తున్నారు.
బాలీవుడ్ లో దేశభక్తికి సంబంధించిన సినిమా కథలతో ఎక్కువగా సినిమాలను తీస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన సినిమాలు సక్సెస్ అవుతుండడంతో దర్శకనిర్మాతలు అటువంటి కథలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో నటి జాన్వీ కపూర్ 'కార్గిల్ గర్ల్' అనే సినిమాలో నటిస్తోంది.
అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం దేశ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకోవాల్సివుంది. కానీ పర్మిషన్స్ తీసుకోకుండానే షూటింగ్ మొదలుపెట్టేసింది చిత్రయూనిట్. రీసెంట్ గా డిఫెన్స్ మినిస్ట్రీ పర్మిషన్ కోరుతూ దరఖాస్తులు చేశారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు ప్రాసెస్ లో ఉన్నాయి. ఇండియన్ తొలి ఎయిర్ఫోర్స్ ఉమెన్ పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి సినిమా షూటింగ్ లక్నోలో మొదలైంది.
ఈ సినిమాలో జాన్వీ.. గుంజన్ సక్సేనా పాత్రలో నటిస్తుండగా ఆమెకి సోదరుడి పాత్రలో అంగద్ బేడీ నటిస్తున్నాడు. జాన్వీ తండ్రిగా పంకజ్ త్రిపాఠి కనిపించనున్నాడు. శరన్ శర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 26, 2019, 2:20 PM IST