కంగనాకి కరోనా పాజిటివ్ .. నేను దాన్ని త్వరగానే ఓడిస్తానంటోన్న నటి
తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది.
కరోనా మహమ్మారి సెలబ్రిటీలను వెంటాడుతుంది. ఇప్పటికే అనేక మంది స్టార్స్ కరోనాతో పోరాడారు. మరికొందరు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇందులో కొందరు కరోనాతో పోరులో ఓడిపోయి తనువుచాలించారు. తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె తాజాగా ప్రకటించింది. నిన్న(శుక్రవారం) టెస్ట్ చేయించుకోగా, నేడు పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది.
`గత కొన్ని రోజులుగా కళ్లలో మంటగా అనిపిస్తుంది. అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. బలహీనంగా ఉన్నాను. హిమాచల్ వెళ్లాలనిపించింది. వెళ్లే ముందు నిన్న టెస్ట్ చేయించుకున్నా. ఈ రోజు ఫలితం వచ్చింది. కోవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో నాకు నేను క్వారంటైన్ అయ్యాను. ఈ వైరస్ నా శరీరంలో ఎక్కడ ఉందనే విషయం నాకు తెలియదు. కానీ దాన్ని నేను ఓడిస్తానని నాకు తెలుసు. ప్రజలు ఎవరూ దీనికి భయపడకండి. ఎందుకంటే భయపడితే మరింత భయపెడుతుంది. రండి ఈ కోవిడ్19ని నాశనం చేద్దాం. ఇదొక చిన్న ఫ్లూ లాంటిది తప్ప మరేది కాదు. కాకపోతే ఎక్కువగా వచ్చింది` అంటూ హరహర మహాదేవ్ అని పేర్కొంది కంగనా. ఈ మేరకు ఆమె ఇంట్లో దైవ సన్నిధిలో ద్యానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోని పంచుకుంది కంగనా. దీంతో ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలని వేడుకుంటున్నారు. ధైర్యాన్నిస్తున్నారు.