ముగిసిన ఎమర్జెన్సీ.. చంద్రముఖీ2 షూటింగ్ లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్
తమిళ, తెలుగు ఆడియన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న చంద్రముఖీ పార్ట్ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సారి చంద్రముఖిగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తుండగా.. తాజాగా ఆమె షూటింగ్ లో జాయిన్ అయ్యింది.
తమిళ తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చంద్రముఖి పార్ట్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాలో చంద్రమిుఖి పాత్రలో కనిపించబోతున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చంద్రముఖి 2 షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని కంగన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. చంద్రముఖి 2'షూటింగ్ స్టార్ట్ చేశామని స్వయంగా ఆమె తెలిపింది. ఈ సినిమాలో అందమైన రాజ నర్తకి పాత్రను కంగన పోషిస్తోంది.
మొన్నటి వరకూ ఎమర్జెన్సీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది కంగనా. ఈ మూవీ షెడ్యూల్ అసోం లో పూర్తి చేసుకుంది. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవితం, ఎమర్జెన్సీ నాటి పరిణామాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఆమె ఇందిర పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, వైశాఖ్ నాయర్, శ్రేయస్ తల్పాడే తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు కంగననే స్వయంగా డైరెక్ట్ చేస్తోంది.
కగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా చంద్రముఖి. 2005 లో రిలీజ్ అయిన ఈ హారర్ కామెడీ మూవీ తమిళ, తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అయితే అప్పుడే ఈ సినిమాకు సీక్వెల్ వస్తుంది అనుకున్నారంతా. కాని రజనీ కాంత్ ఈసినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో.. సీక్వెల్ ప్రయత్నం ఆగిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఈసినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది.
అయితే ఈసారి చంద్రముఖి సీక్వెల్ లో రజనీ కాంత్ కు బదులుగా రాఘవ లారెన్స్ హీరోగా ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. చంద్రముఖిని తెరకెక్కించిన పి.వాసు దర్శకుడిగా.. ఈసినిమా రాబోతోంది. అయితే చంద్రముఖి పాత్రలో ఎవరిని తీసుకోవాలి అని చాలా రోజలుగా హీరోయిన్ వేటలో ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ తార కంగనారనౌత్ ను ఎంపిక చేశారు.
అయితే చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్రకు కొనసాగింపుగా కంగనారనౌత్ కనిపించనుంది. ఈ పాత్రకు డాన్స్ కచ్చితంగా వచ్చి ఉండాలి. ఇక క్లాసికల్ డాన్స్ లో కంగనాకు చక్కటి ప్రవేశం ఉండటంతో ఆమెను ఈ సినిమాకు ఎంపిక చేశారని తెలుస్తోంది. ఈమూవీలో రాజనర్తకిగా కంగనారనౌత్ కనిపించనుందట. సినిమా అంతటికి ఈ క్యారెక్టర్ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.