తారకరత్న ఆరోగ్యంపై కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే..? ఆ రెండు ప్రశ్నలను దాటవేసిన నందమూరి హీరో..
కళ్యాణ్ రామ్ తాను నటించిన `అమిగోస్` గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన రెండు ప్రశ్నలకు ఆన్సర్లు స్కిప్ట్ చేశారు. ఎందుకు?
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం `అమిగోస్` చిత్రంలో నటించారు. ఇది ఈ నెల(ఫిబ్రవరి) 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా `అమిగోస్` సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కరోనాకి ముందు టైమ్లో ఓకే చేసిన కథ ఇదన్నారు. కథ నచ్చి ఈ సినిమా చేసినట్టు చెప్పారు. మనిషిని పోలిన మనషులుంటారనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని, మూడు డిఫరెంట్ రోల్స్, వాళ్లు ఎలా ప్రవర్తిస్తారనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇదొక మంచి ఎంటర్టైనింగ్ మూవీ అన్నారు.
మూడు పాత్రల్లో నటించడం చాలా ఛాలెంజింగ్గా ఉందని, ఓ కొత్త అనుభూతినిచ్చిందని చెప్పారు. డిఫరెంట్ స్టోరీ ఆడియెన్స్ కి ఓ కొత్త అనుభూతిని పంచుతుందని చెప్పారు కళ్యాణ్ రామ్. దర్శకుడు రాజేంద్ర బాగా తెరకెక్కించారని చెప్పారు. వాహ్ అనే సీన్లు చాలా ఉంటాయన్నారు. కరోనా కారణంగా వచ్చిన గ్యాప్లో తాను సినిమాల గురించి ఆలోచించానని, ఫెయిల్యూర్కి కారణం ఏంటందనేది బాగా ఆలోచించానని స్క్రిప్ట్ ల విషయంలో రియలైజ్ అయినట్టు చెప్పారు.
ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్కి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ, ఆ విషయం డాక్టర్లు చెబితే బాగుంటుందని, తాను కామెంట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. తారకరత్న హెల్త్ పై డాక్టర్ల నుంచే అప్డేట్ రావాలన్నారు. దీంతో తారకరత్న హెల్త్ అప్డేట్పై నెలకొన్న సస్పెన్స్ అలానే ఉండిపోయింది. ఇటీవల `అమిగోస్` ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఎన్టీఆర్గానీ, కళ్యాణ్ రామ్గానీ స్పందించలేదు. ఫ్యాన్స్ ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని ఆశించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ `అమిగోస్` సినిమాని చూశారా? ఆయన స్పందనేంటి అనే మరో ప్రశ్న ఎదురయ్యింది. దీనిపై ఆయన సమాధానం దాటవేశారు. దీనిపై తాను కామెంట్ చేయలేనని తెలిపారు. జనరల్గా తన సినిమాలను తమ్ముడు(ఎన్టీఆర్) ముందుగానే చూస్తారని, సినిమాపై ఆయన జడ్జ్ మెంట్ ఇస్తారని `బింబిసార` ప్రమోషన్స్ సమయంలో చెప్పారు. తారక్ జడ్జ్ మెంట్ కరెక్ట్ గా ఉంటుందన్నారు. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా కళ్యాణ్ రామ్ అన్న కాలర్ ఎగరేసే సినిమా అవుతుందన్నారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. అయితే `అమిగోస్` సినిమా విషయంలో ఆయన ఫీడ్ బ్యాక్ని కళ్యాణ్ రామ్ చెప్పకపోవడం గమనార్హం. మరి ఆయన చూశారా? చూస్తే ఏమన్నారు? చూడలేదా? అనేది సస్పెన్స్.
ఇక ప్రస్తుతం తాను `డేవిల్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుందన్నారు. త్వరలోనే దీనికిసంబంధించిన అప్డేట్లు ఇస్తామన్నారు. మరోవైపు `బింబిసార` సీక్వెల్ గురించి చెబుతూ ఈ ఏడాది ఎండింగ్లో ఈ సినిమాని ప్రారంభిస్తామన్నారు. `అమిగోస్` సీక్వెల్ లేదని, అలాంటి కథ కాదన్నారు కళ్యాణ్ రామ్. ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.